ఏ గ్రేడు దిశగాపద్మావతి డిగ్రీ కళాశాల
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను త్వరలో న్యాక్ కమిటీ పరిశీలించనుంది. ‘ఏ’ గ్రేడు గుర్తింపును పొందడానికి కళాశాల అధికారులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను పొందుపరిచిన నివేదిక(సెల్ఫ్ స్టడీ రిపోర్టు)ను ఇటీవల కళాశాల
న్యాక్కు ప్రతిపాదనలు
న్యూస్టుడే, మహిళా వర్సిటీ(తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను త్వరలో న్యాక్ కమిటీ పరిశీలించనుంది. ‘ఏ’ గ్రేడు గుర్తింపును పొందడానికి కళాశాల అధికారులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను పొందుపరిచిన నివేదిక(సెల్ఫ్ స్టడీ రిపోర్టు)ను ఇటీవల కళాశాల అధికారులు బెంగళూరులోని న్యాక్ కార్యాలయానికి పంపారు. ఏడాది కాలంలో కళాశాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పనులు, తీసుకున్న నిర్ణయాలు, విద్యార్థినుల సంఖ్య, నూతన కోర్సులు, ప్రాజెక్టులు, పరిశోధనలు, వసతి గృహాలు, భవనాల నిర్మాణం, కళాశాల పరిశుభ్రత, ప్రాంగణ నియామకాలు తదితర అంశాలను నివేదికలో పొందుపరిచారు. కళాశాల న్యాక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఉమారాణి, కో-కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న వ్యవహరిస్తున్న డాక్టర్ సి.భువనేశ్వరిదేవి ఈ నివేదికను పంపారు.
అధిక మొత్తంలో నిధులు: ‘ఏ’ గ్రేడు సాధిస్తే నిధులు అధిక మొత్తంలో కళాశాలకు వస్తాయి. మంచి ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కళాశాలలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పీజీ విద్యార్థినుల తరగతుల నిర్వహణకు ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించారు. గ్రంథాలయంలో ఈ జర్నల్స్, రిసోర్స్ పెంచడం, వసతి గృహాల సంఖ్యను పెంచారు. న్యాక్ కమిటీ కళాశాల సందర్శనకు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!