వనిత..చేయూత
స్త్రీలను సాహస గుణం మెండు. ప్రోత్సహిస్తే.. ఏ రంగంలోనైనా రాణించగలరు. పోటీ ప్రపంచంలో ఆర్థిక ప్రగతిని సాధించాలన్న తపన వారిలో పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్వయం ఉపాధి వైపు పరుగులు తీస్తున్నారు. విభిన్న రంగాల్లో ప్రవేశించి.. విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణిలో
ఎస్వీయూలో మహిళల అభ్యున్నతికి కృషి
లింగ నిష్పత్తిపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న మహిళా
అధ్యయన కేంద్రం అధికారులు (దాచిన చిత్రం)
స్త్రీలను సాహస గుణం మెండు. ప్రోత్సహిస్తే.. ఏ రంగంలోనైనా రాణించగలరు. పోటీ ప్రపంచంలో ఆర్థిక ప్రగతిని సాధించాలన్న తపన వారిలో పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్వయం ఉపాధి వైపు పరుగులు తీస్తున్నారు. విభిన్న రంగాల్లో ప్రవేశించి.. విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్న మహిళలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం. -న్యూస్టుడే, తిరుపతి(ఎస్వీయూ)
ఎస్వీయూలో 2007లో మహిళా అధ్యయన కేంద్రం ప్రారంభమైంది. 2009లో కేంద్రానికి యూజీసీ గుర్తింపు లభించింది. కేవలం పీజీ కోర్సును నడపడమే కాకుండా, సమాజంలో మహిళల ప్రగతికి నడుం బిగించాలన్నది కేంద్రం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం విభాగంలో పీజీ, పీహెచ్డీ విద్యార్థులు 50 మంది ఉన్నారు. విద్యార్జనతో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఇప్పటివరకు కేంద్రం ఆధ్వర్యంలో 50 ఇంటర్న్షిప్ కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు విభిన్న అంశాలపై ఇక్కడి విద్యార్థులు అవగాహన కల్పించారు. వీటితో పాటుగా అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు గత పదేళ్లలో ఏడాదికి 15 చొప్పున దాదాపు 150కి పైగా కార్యక్రమాలు నిర్వహించి మహిళల ప్రగతికి కృషిచేశారు.
సమాజాభివృద్ధిలో..
సమాజాభివృద్ధిలో స్త్రీల పాత్ర ఎంతో కీలకమన్నదే.. ఉమెన్ స్టడీస్ కోర్సు సిలబస్ సమగ్ర సారాంశం. లింగ సమానత్వం, లింగ నిష్పత్తి, మహిళా చట్టాలు, హక్కులు.. తదితర అంశాలపై కేంద్రం విద్యార్థులు విద్యార్జన చేస్తూ ఇంటర్న్షిప్ కార్యక్రమాల ద్వారా సంబంధిత అంశాల్లో మహిళలకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా సమాజంలో అంటువ్యాధులను అరికట్టడంలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి. పిల్లలు, కుటుంబాన్ని అంటువ్యాధుల బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను విద్యార్థులు తెలియజేస్తున్నారు. దాడులను ఎదుర్కోవడానికి మహిళలకు ఉన్న న్యాయపరమైన హక్కులను, చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
20 ప్రాజెక్టుల మంజూరు
గ్రామాల్లో పొదుపు మహిళా సంఘాలను సైతం కేంద్రం విద్యార్థులు కలుస్తూ ఆర్థిక క్రమశిక్షణ, నగదును పొదుపు చేసుకునే విధానంపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా ఆయా అవగాహన కార్యక్రమాల్లో ఐదువేల మంది మహిళలు పాల్గొన్నట్లు కేంద్రం అధ్యాపకులు పేర్కొంటున్నారు. సమాజాన్ని చైతన్య పరుస్తూ ముందుకెళ్తున్న ఈ విభాగానికి యూజీసీ ఇప్పటివరకు 20 ప్రాజెక్టులను మంజూరు చేసింది. వీటిని నిర్వహించిన కేంద్రం డైరెక్టర్ ఆచార్య కృష్ణమూర్తి, అధ్యాపకులు రమణ, రాజరాజేశ్వరి, శ్రీలతకిషోరి, సునీత, జగదీశ్వరి క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను నివేదికల ద్వారా యూజీసీకి తెలియజేశారు.
క్షేత్రస్థాయిలో శిక్షణమహిళల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలు ఉమెన్ స్టడీస్ ద్వారా చేపట్టాం. మేం నిర్వహించిన కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో మహిళలు విచ్చేసి అవగాహన పొందారు. ఎక్కువగా ఇంటర్న్షిప్ కార్యక్రమాలు చేపట్టి క్షేత్రస్థాయిలో మహిళల ప్రగతికి కృషిచేస్తున్నాం. -ఆచార్య కృష్ణమూర్తి, డైరెక్టర్, మహిళా అధ్యయన కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?
[ 28-03-2024]
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. -
వృద్ధులు.. దివ్యాంగుల ఓట్లపై వాలంటీర్ల గురి
[ 28-03-2024]
చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది. -
అనిశా వలలో ఆర్ఐ
[ 28-03-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు -
శ్రీవారి సేవలో రామ్చరణ్ దంపతులు
[ 28-03-2024]
శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు -
బకాయిలిస్తేనే మరమ్మతులు
[ 28-03-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. -
విధుల నుంచి వాలంటీర్ తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్-4 వాలంటీర్ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 28-03-2024]
సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మత్తు.. చిత్తు
[ 28-03-2024]
ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. -
రెండో రోజూ హైడ్రామా!
[ 28-03-2024]
రేణిగుంట మండలం పీసీఆర్ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది. -
‘మేం కలిసి పనిచేసినా మంత్రి రోజా ఓడిపోతుంది’
[ 28-03-2024]
నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఈ రంగులు మారవా.. సార్..!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం -
కోడ్ అమలులో నిర్లక్ష్యం...
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. -
యువకుడి ఆత్మహత్య
[ 28-03-2024]
ప్రేమించిన యువతి మాట్లాడక పోవడంతో వింజంకు చెందిన ధనుష్(20) బుధవారం సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. -
తెదేపాలో చేరిక
[ 28-03-2024]
మాజీ కార్పొరేటర్ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై ‘బైండోవర్’ వేధింపులు
[ 28-03-2024]
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
వారికి సిద్ధం.. ప్రజలకు కష్టం
[ 28-03-2024]
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
[ 28-03-2024]
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి