logo

3.79లక్షల మందికివైైకుంఠ ద్వార దర్శనం..తితిదే

వైైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల 13 నుంచి 22 వరకు 3.79 లక్షల మంది భక్తులకు శ్రీవారి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వెనుకబడిన వర్గాల నుంచి 6,949 మంది, అలిపిరి నడకమార్గంలో 26,240 మంది, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం ద్వారా 1.66లక్షల

Published : 24 Jan 2022 05:01 IST

తిరుమల, న్యూస్‌టుడే: వైైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల 13 నుంచి 22 వరకు 3.79 లక్షల మంది భక్తులకు శ్రీవారి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వెనుకబడిన వర్గాల నుంచి 6,949 మంది, అలిపిరి నడకమార్గంలో 26,240 మంది, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం ద్వారా 1.66లక్షల మంది, సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ ద్వారా 83వేల మంది, శ్రీవాణి ట్రస్టు ద్వారా 15,465 మంది, దాతలు 7,917 మంది, వర్చువల్‌ సేవా టికెట్ల ద్వారా 43,250 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు 4లక్షల లడ్డూలను అందించారు. హుండీ కానుకలు రూ.26.61 కోట్లు లభించాయి. పదిరోజులకు 42,809 గదులను భక్తులకు కేటాయించగా రూ.4.68 కోట్ల ఆదాయం లభించింది. శ్రీవారికి 1.23 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆలయంలో చేపట్టిన పుష్పాలంకరణకు దాతల నుంచి 31 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 3.5లక్షల కట్‌ ఫ్లవర్లు వినియోగించారు.

రూ.1.30 కోట్లతో మరమ్మతులు పూర్తి

భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలను యుద్ధప్రాతిపదికన రూ.1.30 కోట్లతో మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తితిదే తెలిపింది. శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.60 కోట్లతో నడకమార్గం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని