ఉరకలేసేఉత్సాహం
ఉరకలు వేసే ఉత్సాహం వారి సొంతం. రోజువారి వ్యాయామం వారి దినచర్యలో భాగం. ఎనిమిది పదుల వయసులోనూ.. అథ్లెటిక్స్లో రాణిస్తున్నారు.. జిల్లాకు చెందిన మాస్టర్ అథ్లెట్లు. పరుగుపందెం, హైజంప్, లాంగ్జంప్, డిస్కస్త్రో, జావెలిన్ త్రో ఈవెంట్లలో రాణిస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. త్వరలో జరగనున్న
ఎనిమిది పదుల వయసులోనూ రాణిస్తున్న అథ్లెట్లు
గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతి అందుకున్న మాస్టర్ అథ్లెట్లు
ఉరకలు వేసే ఉత్సాహం వారి సొంతం. రోజువారి వ్యాయామం వారి దినచర్యలో భాగం. ఎనిమిది పదుల వయసులోనూ.. అథ్లెటిక్స్లో రాణిస్తున్నారు.. జిల్లాకు చెందిన మాస్టర్ అథ్లెట్లు. పరుగుపందెం, హైజంప్, లాంగ్జంప్, డిస్కస్త్రో, జావెలిన్ త్రో ఈవెంట్లలో రాణిస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. - న్యూస్టుడే, తిరుపతి(క్రీడలు)
వ్యాయామం చేయనిదే రోజు గడవదు
తిరుపతికి చెందిన ఎం.మునస్వామిరెడ్డి(84) ఎస్వీ పశువైద్య వర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. విద్యార్థి దశలో క్రీడలపై మక్కువ పెంచుకుని రాణించారు. మొదట్లో ఫుట్బాల్, హాకీ ఆడేవారు. ఆ తరువాత అథ్లెటిక్స్లో షాట్పుట్, లాంగ్జంప్, త్రిపుల్జంప్, 200మీ పరుగుపందెంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం లాంగ్జంప్ 4.5మీటర్లు, ట్రిపుల్జంప్ 9.08మీ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు, రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. రోజువారీ వ్యాయామంలో తనకు శక్తి, ఓపిక లభిస్తోందని, వ్యాయామం చేయనిదే రోజు గడవదని చెబుతున్నారు.. మునస్వామిరెడ్ఢి
ఆర్మీ, పోలీసు అభ్యర్థులకు శిక్షణ
తిరుపతి బాలాజీ కాలనీకి చెందిన నీరజ(72) వ్యాయామ ఉపాధ్యాయురాలిగా, అధ్యాపకురాలిగా పనిచేశారు. మాస్టర్ అథ్లెట్గా కొనసాగుతున్నారు. 100మీ, 200మీ పరుగుపందెం, హైజంప్, ట్రిపుల్జంప్, హర్డిల్స్, 5కిమీ, 10కిమీ నడక వంటి ఈవెంట్లలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని పలు బంగారు, వెండి, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 1990లో మలేషియా వేదికగా జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 5కిమీ నడక విభాగంలో రెండో స్థానం సాధించారు. ఇటీవల గుంటూరులో జరిగిన పోటీల్లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. తారకరామ స్టేడియంలో ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం సాధన చేసే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మెలకువలు నేర్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆటలు ఆడించడం ఇష్టం
తిరుపతి ఎల్ఐసీ నగర్కు చెందిన పుష్పకుమారి(83) చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పలు పాఠశాల్లో పనిచేసి విద్యార్థినులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. 1997లో పదవీవిరమణ పొందారు. ప్రతిరోజూ మైదానంలో అథ్లెటిక్స్ సంబంధించిన వ్యాయామం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర, స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించారు. ఇటీవల గుంటూరులో జరిగిన పోటీల్లో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. మైదానంలో క్రీడాకారులను ఆటలాడించడం అంటే ఇష్టమని చెబుతున్నారు.. పుష్పకుమారి.
జాతీయ స్థాయి పోటీలకు అర్హత
చిత్తూరుకు చెందిన ఎల్.సుశీల(63) తిరుపతిలో నివాసం ఉంటున్నారు. పశుసంవర్ధక శాఖలో సూపరింటెండెంట్గా పనిచేసి 2019లో పదవీవిమరణ పొందిన సుశీల మాస్టర్ అథ్లెటిక్స్లో పతకాల పంట పండిస్తున్నారు. అథ్లెటిక్స్లో హర్డిల్స్, లాంగ్జంప్, ట్రిపుల్జంప్, హైజంప్, జావెలిన్త్రో ఈవెంట్లలో రాణిస్తున్నారు. 2006లో బెంగళూరులో జరిగిన ఆసియా మాస్టర్ అథ్లెటిక్స్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీల గుంటూరు వేదికగా జరిగిన పోటీల్లో బంగారు 2, వెండి 1 పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వ్యాయామంతోనే చక్కటి ఆర్యోగం లభిస్తోందని అభిప్రాయపడ్డారు సుశీల.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!
[ 18-04-2024]
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు. కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. -
కర్ణాటక మద్యం తరలిస్తూ...
[ 18-04-2024]
కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ విధ్వంస రచన!
[ 18-04-2024]
నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. -
పస్తులతో పనులు చేస్తున్నాం
[ 18-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. -
20న చంద్రబాబు పర్యటన
[ 18-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. -
జడ్పీలో లేకున్నా అతనే కీలకం
[ 18-04-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. -
సమగ్ర శిక్షే
[ 18-04-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. -
ఇంట్లో దూరింది నిజమే..
[ 18-04-2024]
జడ్పీ నోడల్ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్ఛార్జి ఎంపీడీవో రాజేష్, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. -
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?