logo

25న కలెక్టరేట్‌ ముట్టడికి తీర్మానం

పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఈ నెల 25న కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీర్మానం చేశాయి. స్థానిక ఎన్జీవోస్‌ హోమ్‌లో ఆదివారం సాయంత్రం ఏపీ ఐకాస, ఏపీఎన్జీవోస్‌, ఏపీసీపీఎస్‌ఈఏ, తితిదే ఉద్యోగుల సంక్షేమం సంఘం, తితిదే సీపీఎస్‌ ఎంప్లాయీస్‌

Published : 24 Jan 2022 05:01 IST


రౌంట్‌ టేబుల్‌ సమావేశమైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఈ నెల 25న కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీర్మానం చేశాయి. స్థానిక ఎన్జీవోస్‌ హోమ్‌లో ఆదివారం సాయంత్రం ఏపీ ఐకాస, ఏపీఎన్జీవోస్‌, ఏపీసీపీఎస్‌ఈఏ, తితిదే ఉద్యోగుల సంక్షేమం సంఘం, తితిదే సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై ఉద్యోగులను సంప్రదించకుండా మంత్రి మండలిలో చర్చించి ఒక కమిటీ వేయడం విచారకరమన్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే కమిటీతో చర్చిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి, ఏటీయూసీ, సీఐటీయూ నాయకులు మద్దతిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని