logo

ఇళ్ల లబ్ధిదారులకు రూ.5లక్షలు మంజూరు చేయాలి

జగనన్న ఇంటి పట్టాలు పంపిణీ చేసిన లబ్ధిదారులకు

Updated : 24 Jan 2022 16:41 IST

మదనపల్లె రూరల్ : జగనన్న ఇంటి పట్టాలు పంపిణీ చేసిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం జగనన్న ఇంటి పట్టాల లబ్ధిదారులతో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద కల్పిస్తున్న ఒకటిన్నర సెంటు భూమి ఏ మాత్రం సరిపోదని రెండున్నర సెంట్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని డీఏవో శేషయ్యకు అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని