AP News: అలిపిరి వద్ద తమిళనాడు భక్తుల ఆందోళన
తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను..
తిరుపతి (తితిదే): తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడంపై నిరసన వ్యక్తం చేశారు. వందల కిలో మీటర్లు పాదయాత్రగా వచ్చిన తమకు స్వామి వారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. గత 26 సంవత్సరాలుగా వేలూరు జిల్లా గుడియాత్తం నుంచి పాదయాత్రగా వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళ్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది కూడా తిరుమలకు పాదయాత్రగా వచ్చామని.. ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల చేయడంతో కేవలం 150 మందికి మాత్రమే దర్శన టికెట్లు లభించాయన్నారు. సుమారు 350 మందికి టికెట్లు లేకపోవడంతో తమకు దర్శన భాగ్యం కలిగించాలని కోరారు. ఈ విషయాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 26 ఏళ్లుగా ఏటా పాదయాత్రగా తిరుమలకు వస్తున్నామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు. తమకు స్వామివారి దర్శనం కల్పించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న భక్తులను తితిదే విజిలెన్స్ పోలీసులు భూదేవి కాంప్లెక్స్కు తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?