logo

Andhra News: కుప్పంలోని ఓ దాబాలో వైకాపా నాయకుల వీరంగం

కుప్పం పట్టణం బైపాస్‌ మార్గంలోని ఓ దాబాలో వైకాపా నాయకులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌, మరో కౌన్సిలర్‌ కుమారుడు, వారి అనుచరులు

Updated : 16 May 2022 10:46 IST

ధ్వంసమైన కుర్చీలు, బల్లలు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం పట్టణం బైపాస్‌ మార్గంలోని ఓ దాబాలో వైకాపా నాయకులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌, మరో కౌన్సిలర్‌ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం వైకాపా నాయకులు దాబాకు వెళ్లగా భోజనం అయిపోయిందని నిర్వాహకులు చెప్పారు. శనివారం రాత్రి మళ్లీ వచ్చి ‘మొన్న మాకు భోజనం లేదన్నారే..’ అని దాబాలో బల్లలు, కుర్చీలు ధ్వంసం చేశారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తామని బెదిరించారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని