ఇక్కడ దొరకదు.. కర్ణాటకకు కరవుండదు
ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రీచ్ల ద్వారా నిర్మాణాలకు అందిస్తామని ప్రకటనలు గుప్పిస్తోంది. వాస్తవంగా చూస్తే.. ఇసుక ఇక్కడ కనిపించడం కష్టమవుతోంది. మొత్తం ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది. ఇక్కడ ప్రజలు ఇసుక కోసం అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా ప
యథేచ్ఛగా తరలిపోతున్న ఇసుక
కౌండిన్య నదిలో ఇసుక తోడుతున్న కూలీలు
ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రీచ్ల ద్వారా నిర్మాణాలకు అందిస్తామని ప్రకటనలు గుప్పిస్తోంది. వాస్తవంగా చూస్తే.. ఇసుక ఇక్కడ కనిపించడం కష్టమవుతోంది. మొత్తం ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది. ఇక్కడ ప్రజలు ఇసుక కోసం అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు.
-న్యూస్టుడే, పలమనేరు : ప్రభుత్వ గృహనిర్మాణాలకు అవసరమైన ఇసుకను తెప్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రవాణా ఛార్జీలు భరిస్తే చాలు.. నిజమైన లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేస్తామని పేర్కొంటున్నారు. అధికారులు చెప్పేదానికి వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. ఇసుక అందుబాటులో లేక ప్రభుత్వ గృహనిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టలేకపోతున్నారు. అక్రమంగా తరలిపోతున్న ఇసుక గురించి అధికారులు నోరు మెదపడం లేదు. సాధారణ ప్రజలు ట్రాక్టరు ఇసుక కావాల్సి ఉంటే రూ.4,500 చెల్లించాలి. అది కూడా అతి కష్టం మీద లభిస్తోంది. గత ప్రభుత్వం మీసేవలో ఆన్లైన్ ద్వారా రూ.800 చెల్లిస్తే ఇసుక లభించేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. ఇసుక మీద ఎవరికి అజమాయిషీ ఉందనే విషయాన్ని కూడా అధికారులు స్పష్టంగా చెప్పటం లేదు. ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
టిప్పర్ ఇసుక రూ.1.25 లక్షలు
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో టిప్పర్ ఇసుక రూ.50 వేల ధర పలుకుతోంది. 10 టైర్ల లారీలో ఇసుక రూ.1.25 లక్షలు. దీంతో వ్యాపారుల అడ్డగోలు వ్యవహారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తోడేస్తున్నారు. ఇటీవల కౌండిన్య నదిలో నీటి నిల్వలు తగ్గడంలో యంత్రాలతో తోడేయడం మొదలు పెట్టారు. పట్టణానికి అత్యంత సమీపంలోని దండపల్లె రోడ్డు వద్ద బహిరంగంగా ట్రాక్టర్లలో ఇసుకను రవాణా చేస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన వారు గుండుగల్లు ప్రాంతంలో భారీ ఎత్తున నిలువ చేస్తున్నారు. అటు నుంచి కర్ణాటక రాష్ట్రానికి సులభంగా తరలించేస్తున్నారు.
ఒక రాత్రికి రూ.12.5 లక్షల ఆదాయం
ఒక రాత్రికి 10 లోడ్ల ఇసుక తరలిస్తే.. రూ.12.5 లక్షల ఆదాయాన్ని అందుకోవచ్ఛు ప్రస్తుతం ఇసుకను దండపల్లెరోడ్డు, గంగవరం, ఏడూరు, కాలోపల్లె, కలగటూరు ప్రాంతాల్లోని కౌండిన్య నది నుంచి తోడుకుంటున్నారు. హడావుడిగా ఇసుక తీయడం వల్ల ఇటీవల గంగవరం మండలం మేలుమాయి గ్రామం వద్ద ఇసుక తోడుతుంటే ఒక వ్యక్తి ఇసుక దిమ్మెలు పడి మృతిచెందాడు. అధికారులు ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
దండపల్లెరోడ్డులో కౌండిన్య నదిలో ఇసుక బహిరంగంగా తోడుస్తున్న విషయమై భూగర్భగనులశాఖ అధికారి వేణుగోపాల్ స్పందిస్తూ అక్రమగా ఇసుక తోడుతున్న ప్రదేశాన్ని పరిశీలిస్తామన్నారు. అనుమతులు లేకుండా రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్