ఇల్లు కట్టకుంటే ..పట్టా రద్దు !
‘ఇంటి పట్టాలు ఇచ్ఛి. ఏడాదిన్నర గడిచినా గృహ నిర్మాణాలు ఎందుకు ప్రారంభించలేదు? మీ గ్రామంలోనే కొందరు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీరు త్వరగా మొదలుపెట్టకపోతే మీ పట్టాలు రద్దు చేసి.. వారికి ఇస్తాం’ ఇదీ చిత్తూరు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు లబ్ధిదారులకు చేస్తు
పేదలను హెచ్చరిస్తున్న రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు
చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందలో గృహ నిర్మాణ లేఔట్ను
పరిశీలిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
‘ఇంటి పట్టాలు ఇచ్ఛి. ఏడాదిన్నర గడిచినా గృహ నిర్మాణాలు ఎందుకు ప్రారంభించలేదు? మీ గ్రామంలోనే కొందరు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీరు త్వరగా మొదలుపెట్టకపోతే మీ పట్టాలు రద్దు చేసి.. వారికి ఇస్తాం’ ఇదీ చిత్తూరు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు లబ్ధిదారులకు చేస్తున్న హెచ్చరిక.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లోనూ కొందరు అధికారులు.. లబ్ధిదారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. త్వరగా నిర్మాణాలు ప్రారంభించాలంటూ హెచ్చరిస్తుండటంతో వారికి ఏం చేయాలో అర్థం కావడంలేదు. పురపాలికల్లో ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి.
‘కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు’ ఇదీ లబ్ధిదారులు.. అధికారులకు చేసుకుంటున్న విన్నపం. ఈనాడు డిజిటల్, చిత్తూరు, న్యూస్టుడే, తిరుపతి(నగరపాలిక)
‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. లబ్ధిదారులను గృహ నిర్మాణాల వైపు మళ్లించాలంటూ.. గృహ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి తిరుపతి, చిత్తూరు జిల్లాల అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది.. పట్టాలు రద్దు చేస్తామంటూ పేదలను హెచ్చరిస్తుండటంతో హడలిపోతున్నారు.
రఖాస్తుదారులు పట్టాలు అడుగుతున్నారంటూ..
అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని పేదలెవరైనా పట్టాల కోసం అర్జీ ఇస్తే 90 రోజుల్లోపు వారికి స్థలం చూపాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్లు, పురపాలికలు, గ్రామాల్లో ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయంగా ప్రైవేటు భూములను సేకరించాల్సిందే. 90 రోజులు దాటినా పట్టాలు ఇవ్వడంలేదంటూ కొందరు ‘స్పందన’లో అర్జీలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల వద్దకు అధికారులు వెళుతున్నారు. మీ వార్డు/ గ్రామంలోనే కొందరు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. మీరు త్వరగా నిర్మాణాలు ప్రారంభించకపోతే ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తామని మౌఖికంగా చెబుతున్నారు.
రూ.35 వేల రుణం ఇవ్వాలని ఆదేశించినా..
ప్రధానంగా చిత్తూరు, పెద్దపంజాణి, పలమనేరు, పూతలపట్టు మండలాలతోపాటు సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. చిత్తూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ఒత్తిళ్లు మరింత అధికంగా ఉన్నాయి. కొందరు లబ్ధిదారులు పట్టాలు వెనక్కు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఇళ్లు నిర్మించుకుంటే వడ్డీ లేకుండా ప్రత్యేకంగా రూ.35వేల రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ఇచ్చే రుణాలనే వీటి కింద బ్యాంకర్లు చూపుతున్నారు. గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించేందుకు ఇటీవల చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ గ్రామాలకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇంటి పనులు ప్రారంభం కాకపోవడానికి ఇది కూడా ఓ కారణమని గుర్తించిన ఆయన.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.●
చిత్తూరు జిల్లాకు మంజూరైన గృహాలు: 72,272
నిర్మాణాలు ప్రారంభంకానివి : 10,290
పునాదుల దశ దాటనవి : 20,547
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?