logo

ముసలి మడుగును వీడని ఏనుగులు

పలమనేరు మండలం ముసలిమడుగు, కృష్ణాపురం గ్రామాలను ఏనుగులు వదలడం లేదు. రైతులు నిత్యం గజరాజుల దాడులతో కుదేలవుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇవి గ్రామాల పరిసరాల్లోని పొలాల్లో తిరుగుతూ ధ్వంసం చేశాయి.

Published : 23 May 2022 05:53 IST


పంట పొలాల్లో ఏనుగుల గుంపు

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరు మండలం ముసలిమడుగు, కృష్ణాపురం గ్రామాలను ఏనుగులు వదలడం లేదు. రైతులు నిత్యం గజరాజుల దాడులతో కుదేలవుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇవి గ్రామాల పరిసరాల్లోని పొలాల్లో తిరుగుతూ ధ్వంసం చేశాయి. రైతులు, అటవీశాఖ సిబ్బంది వాటిని తరమడానికి చేసిన యత్నాలు విఫలమయ్యాయి. అవి అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చేయడంతో విసిగిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం అడవిలోకి వెళ్లిపోవడతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు