కాలనీ దాటితే రాయితీ గల్లంతే..?
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రతి నెలా లభించే విద్యుత్తు రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. వారు వినియోగించుకున్న మొత్తాన్ని విద్యుత్తు సంస్థకు ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. కాలనీలు, తాండాల్లో నివసించే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులే రాయితీకి అర్హులంటూ 2020లో
ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు వినియోగదారులపై సర్వే
అసలే పెరిగిన విద్యుత్తు ఛార్జీల భారంతో అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రాయితీకి మంగళం పాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకుంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. రెండేళ్ల కిందట జారీ చేసిన ఉత్తర్వులకు అధికారులు ఇప్పుడు మళ్లీ పదును పెడుతున్నారు.. ఆంక్షల పేరుతో రాయితీని కుదించేందుకు, అర్హులెందరో లెక్క తేల్చేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నారు.
చిత్తూరు (మిట్టూరు), న్యూస్టుడే: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రతి నెలా లభించే విద్యుత్తు రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. వారు వినియోగించుకున్న మొత్తాన్ని విద్యుత్తు సంస్థకు ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. కాలనీలు, తాండాల్లో నివసించే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులే రాయితీకి అర్హులంటూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎక్కడా ఇది బయటకు పొక్కలేదు. కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు కేవలం వారి కుల ధ్రువపత్రాన్ని విద్యుత్తు శాఖ అధికారులకు అందజేస్తే రాయితీ వర్తించేది. కొత్త నిబంధనల కారణంగా కాలనీలు, తండాల్లో కాపురం ఉండేవారే అర్హులు. వేరేచోట నివాసం ఉంటూ 200 యూనిట్ల లోపు వినియోగించుకున్నా రాయితీ వర్తించదు. బిల్లు అందరిలా చెల్లించాల్సిందే. దీనిపై ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో సరైన వసతి లేక ఇతర ప్రాంతంలో చిన్నఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నా వారిని అనర్హులుగా గుర్తిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1.62 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. తాజా నిర్ణయంతో చాలామందిని అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛార్జీల భారాన్ని దించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీలు నివసించే ఇళ్లలో ఇప్పుడు వేరేవారు ఎవరైనా నివసిస్తున్నారా? వారి పేరిట వీరు లబ్ధి పొందుతున్నారా? లబ్ధిదారుడి ఆధార్ కార్డుతో విద్యుత్తు కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా? తదితర పూర్తి వివరాలు సమగ్రంగా సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యుత్తు సహాయకులతో సర్వే చేయిస్తున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివాసం ఉండేవారికి సంబంధించిన వివరాలు మాత్రమే ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉచిత విద్యుత్తును వీరికే వర్తింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
* పది రోజుల్లో సర్వే పూర్తి
ఉచిత విద్యుత్తు అర్హులు ఎంత మంది..? అనర్హులెందరు తేల్చనున్నాం. అధికారులు, సిబ్బందితో సర్వే చేస్తున్నాం. 10 రోజుల్లో లెక్క తేలనుంది.
- హరి, చిత్తూరు జిల్లా ప్రత్యేక అధికారి, విద్యుత్తు శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా