logo

జంట హత్యల కేసులో నిందితుడి అరెస్టు

సదుం మండలం అమ్మగారిపల్లె పంచాయతీ, ఎగువజాండ్రపేటలో ఈ నెల 20న శుక్రవారం రాత్రి జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. ‘మదనపల్లె మండలం మాలేపాడులో రాము

Published : 24 May 2022 05:29 IST


నిందితుడి అరెస్టు చూపి వివరాలు వెల్లడిస్తున్న సీఐ మధూసూదన్‌రెడ్డి, ఎస్సై ధరణీధర

సదుం: సదుం మండలం అమ్మగారిపల్లె పంచాయతీ, ఎగువజాండ్రపేటలో ఈ నెల 20న శుక్రవారం రాత్రి జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. ‘మదనపల్లె మండలం మాలేపాడులో రాము అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన రాధారాణి తన భర్త నరసింహులును వదిలేసి జీవిస్తోంది. ఈ క్రమంలో రాము నాలుగు నెలలుగా రాధారాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె అన్న వెంకటరమణతో కలిసి సుమారు నెలరోజుల కిందట సదుం మండలం ఎగువజాండ్రపేటలో జయారెడ్డి వాటర్‌ప్లాంటులో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నెల 20న రాధారాణి రాముతో గొడవపడి తన భర్త వద్దకు వెళ్లిపోతానని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న రాము.. రాధారాణి తలపై రాయితో మోది చంపాడు. అడ్డువచ్చిన ఆమె అన్న వెంకటరమణను కొట్టి చంపాడు. సోమవారం అమ్మగారిపల్లె వీఆర్వో మహబుబ్‌బాషా సమక్షంలో నిందితుడు పోలీసులకు లొంగిపోయినటు’్ల సీఐ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని