logo

ఉద్యోగోన్నతుల సీనియార్టీ జాబితా సిద్ధం చేయండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు ప్రభుత్వం త్వరలో ఉద్యోగోన్నతి కల్పించనున్న నేపథ్యంలో సీనియార్టీ జాబితాను సిద్ధం చేయాలని డీఈవో పురుషోత్తం అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన కార్యాలయ అధికారులు,

Published : 24 May 2022 05:29 IST


అధికారులతో సమీక్షిస్తున్న డీఈవో పురుషోత్తం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు ప్రభుత్వం త్వరలో ఉద్యోగోన్నతి కల్పించనున్న నేపథ్యంలో సీనియార్టీ జాబితాను సిద్ధం చేయాలని డీఈవో పురుషోత్తం అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. డీఈవో మాట్లాడుతూ జాబితా రూపకల్పనలో తప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ జాబితా తయారీకి చిత్తూరు నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లాకు వెళ్లిన సిబ్బందిలో అవసరమైన వారిని ఇక్కడ పనిచేసేందుకు ఉత్తర్వులు సిద్ధం చేసి పంపాలని సూచించారు. అభ్యంతరాలుంటే ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలన్నారు. పకడ్బందీగా జాబితా సిద్ధం చేసి.. ఆపై దాన్ని ఏడీలు రెండుమూడు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. సమావేశంలో ఏడీలు(సర్వీసెస్‌, స్కీమ్స్‌) విజయేంద్రరావు, వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు