విత్తన విలాపం..కేటాయింపుల్లో కోతలు
జిల్లాలో ఖరీఫ్ సాగు రైతులకు వేరుసెనగ విత్తన విలాపం తప్పేలా లేదు.. ముందస్తు తొలకరి వర్షాలతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు.. ఇప్పటికే పొలాలను దుక్కులు చేయడం కొందరు రైతులు మొదలు పెట్టగా.. మరికొందరు ముందస్తుగానే విత్తుకు సన్నద్ధమవుతున్నారు..
సరఫరాలో తీవ్ర జాప్యం
అవస్థల్లో వేరుసెనగ రైతులు
జిల్లాలో ఖరీఫ్ సాగు రైతులకు వేరుసెనగ విత్తన విలాపం తప్పేలా లేదు.. ముందస్తు తొలకరి వర్షాలతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు.. ఇప్పటికే పొలాలను దుక్కులు చేయడం కొందరు రైతులు మొదలు పెట్టగా.. మరికొందరు ముందస్తుగానే విత్తుకు సన్నద్ధమవుతున్నారు.. వ్యవసాయ శాఖ అందజేసే రాయితీ వేరుసెనగ విత్తు కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు..
న్యూస్టుడే,చిత్తూరు(మిట్టూరు) విత్తు పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలియకపోగా.. కేటాయింపుల్లో భారీగా కోత విధిస్తున్నారు.. విత్తన కేటాయింపులను తగ్గించడంతో ఇటు వ్యవసాయాధికారుల్లో.. అటు రైతుల్లో ఆందోళన మొదలైంది.. ప్రస్తుతం కేటాయించిన విత్తనం సరిపోయే పరిస్థితి లేదంటూ ఆ శాఖ అధికారులే చర్చించుకోవడం గమనార్హం.
33,700 క్వింటాళ్ల విత్తనమే..
జిల్లాకు కేవలం 33,700క్వింటాళ్ల రాయితీ వేరుసెనగ విత్తనాన్ని కేటాయించారు. కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా 31 మండలాలకే పరిమితం కాగా.. ఖరీఫ్లో వేరుసెనగ సాధారణ సాగు విస్తీర్ణం 55,661 హెక్టార్లకు తగ్గింది. ఈ విస్తీర్ణానికి సరిపడా విత్తన కేటాయించకపోవడం శోచనీయం. గతేడాది అధిక వర్షాల వల్ల వేరుసెనగ పంట నష్టపోయి చేతికి రాలేదు. దీంతో రాయితీ విత్తనంపైనే రైతులు ఆధారపడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేటాయింపుల్లో భారీ కోత వల్ల విత్తన కాయల కోసం రైతులకు పాట్లు తప్పేలా లేదు.
సరఫరాలో తీవ్ర జాప్యం..
జిల్లాలోని 502 ఆర్బీకేలకు ఏపీ విత్తన సంస్థ విత్తన కాయలు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 12,550 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. విత్తన సరఫరాలో ఏపీ విత్తన సంస్థ తీవ్ర జాప్యం చేస్తోందనే బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ప్రణాళికాబద్ధంగా సరఫరా చేస్తే.. ఈ ఏడాది నిర్దిష్ట ప్రణాళిక కొరవడింది. ఉన్నతాధికారులు స్పందించి జిల్లాకు సరిపడా విత్తన కేటాయింపులతో పాటు సకాలంలో ఆర్బీకేలకు విత్తన సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
వేరుసెనగ సాగు విస్తీర్ణం, విత్తన కేటాయింపులు ఇలా..
జిల్లాలో సాగు విస్తీర్ణం: 55,661హెక్టార్లు
రాయితీతో 30 కిలోల బస్తా ధర: రూ.1544.40
మళ్లీ కోత విధించి.. మూడో విడత కేటాయింపు:33,700 క్వింటాళ్లు
కోత విధించి రెండో విడత కేటాయింపు:41 వేల క్వింటాళ్లు
తొలుత విత్తన కేటాయింపు:48,800 క్వింటాళ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!