జూన్ ఒకటి నుంచి కొత్త బాదుడు
పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోనూ పెరిగిన విలువలపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల్ని ఇక నుంచి వసూలు చేయనున్నారు. దీంతో చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలనుకునే పేద,
నిర్మాణాల మార్కెట్ విలువ సవరణ
ఉమ్మడి జిల్లాపై రూ.10 కోట్ల భారం
స్థిరాస్తి రిజిస్ట్రేషన్ క్రయవిక్రయాలు సాగించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. మట్టి మిద్దెల నుంచి ఎత్తైన భవనాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువలు పెంచేసింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్ల ఫారాల భవన నిర్మాణాలపై అదనపు వడ్డన విధించింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా ప్రస్తుత విలువలపై సగటున 5 శాతం చొప్పున పెంచడం ద్వారా ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై అదనంగా రూ.10 కోట్ల భారం పడనుందని అంచనా.
చిత్తూరు(సంతపేట), న్యూస్టుడే: పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోనూ పెరిగిన విలువలపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల్ని ఇక నుంచి వసూలు చేయనున్నారు. దీంతో చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలనుకునే పేద, మధ్య తరగతి వర్గాలకు అదనపు భారం పడనుంది. సవరించిన విలువలపై ఇప్పటికే జిల్లా పరిషత్ ఆమోదం లభించింది. తర్వాత పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదం దక్కడం ఇక లాంఛనమే. ఈ పెంపుదల జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పటికే భూముల విలువల్ని పెంచిన విషయం విదితమే. ఇప్పుడు నిర్మాణాల మార్కెట్ విలువలూ పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలు మరో బాదుడుని భరించాల్సిందే.
అదనపు భారమిలా..: గతంలో చదరపు అడుగు రూ.1,140 విలువతో 1,500 మొత్తం విస్తీర్ణం గల ఆర్సీసీ నివాస గృహం విలువ రూ.17 లక్షలు అనుకుంటే.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముగా రూ.1.28 లక్షలు చెల్లించాల్సి ఉండేది. కొత్త విలువ ప్రకారం రూ.1,200 విలువతో 1,500 మొత్తం విస్తీర్ణం గల ఆర్సీసీ నివాస గృహం విలువ రూ.18 లక్షలు కానుంది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముగా రూ.1.35 లక్షలు చెల్లించాలి. అంటే రుసుముల రూపంలో అదనంగా రూ.7 వేల వరకు చెల్లించాలని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి