నకిలీ కంపెనీలో పెట్టుబడులు
‘హలో..నాది మలేషియా, నాపేరు ఇమిలీ చాన్.. నాకు కెప్పల్ డైమండ్ కంపెనీ ఉంది. సింగపూర్లోని కెప్పల్ కార్పొరేషన్లో డైమండ్, ప్లాస్టిక్ ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ ఎనాలసిస్ చేస్తుంటా. ఇందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయి..
రూ.14.40 లక్షలు మాయం
తడలో మోసపోయిన ప్రైవేటు ఉద్యోగి
తడ, న్యూస్టుడే: ‘హలో..నాది మలేషియా, నాపేరు ఇమిలీ చాన్.. నాకు కెప్పల్ డైమండ్ కంపెనీ ఉంది. సింగపూర్లోని కెప్పల్ కార్పొరేషన్లో డైమండ్, ప్లాస్టిక్ ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ ఎనాలసిస్ చేస్తుంటా. ఇందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయి.. కావాలంటే వెబ్సైట్ తనిఖీ చేసుకోండి.. కంపెనీ వృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది’ అంటూ ఓ మహిళ వాట్సాప్ కాల్ చేసింది. తొలుత అనుమానం వచ్చినా.. తరువాత వెబ్సైట్ పరిశీలిస్తే కంపెనీ లాభాల భాటలో ఉన్నట్లు చూపించడంతో విడతల వారీగా రూ.14,40,000 పెట్టుబడి పెట్టాడు. తీరా అవసరం నిమిత్తం కొంత మొత్తం ఉపసంహరించుకుంటానని చెప్పిన కొంతసేపటికే వెబ్సైట్ పనిచేయడం లేదు. వాట్సాప్ నంబరు స్విచ్ఛాఫ్ అయ్యింది. అప్పుడు తెలిసింది తను మోసపోయానని, తాను పెట్టుబడి పెట్టింది నకిలీ కంపెనీలో అని.. తడకు చెందిన బాధితుడు కె.విశ్వనాథ్ జరిగిన ఘటనపై మంగళవారం ఫిర్యాదు చేయడంతో ఎస్సై జేపీ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు పరిధిలోని కాంచీపురం జిల్లా మాంబాక్కం తాలూకా, పోలాచేరి గ్రామానికి చెందిన కె.విశ్వనాథ్ తడ మండలంలోని పూడి గ్రామంలో రాయల్ టూల్స్ కంపెనీలో మేనేజరుగా పనిచేస్తున్నారు. అక్కడే లేక్వ్యూ అతిథి గృహంలో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 30న గుర్తుతెలియని మహిళ తనను తాను పరిచయం చేసుకుని ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్ కాల్ చేసింది. ఆమె మాటలు నమ్మిన విశ్వనాథ్ తొలుత ఏప్రిల్ 12న రూ.15 వేల పెట్టుబడి పెట్టారు. తమ కంపెనీలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టాలని, ఎంత ఎక్కువ పెడితే అంత లాభం పొందొచ్చని కంపెనీ నుంచి ఫోన్ చేశారు. అప్పటి నుంచి విశ్వనాథ్ కంపెనీ సూచించిన బ్యాంకు ఖాతాలకు నగదును విడతల వారీగా రూ.14.40 లక్షలు జమ చేశారు. ఏప్రిల్ నెలాఖరుకు కంపెనీ వెబ్సైట్లో ఉంచిన తన ఖాతాలో అప్పటివరకు పెట్టిన పెట్టుబడి కాకుండా ఆదాయం రూ.12,28,350 ఉన్నట్లు చూపించింది. ఈ క్రమంలో అవసరాల కోసం విశ్వనాథ్ రూ.4.75 లక్షలు నగదు తీసుకుంటానని అనుమతి కోరారు. అందుకువారు సరేననడంతో వెబ్సైట్ నుంచి తన బ్యాంకు ఖాతాకు నగదు మళ్లించినట్లు చెప్పారు. కానీ నగదు జమ కాలేదు. దాంతో సదరు కంపెనీకి ఫోన్ చేయగా రెండుమూడు రోజులు పడుతుందన్నారు. అయినా నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చి వెబ్సైట్ పరిశీలిస్తే మూతవేసినట్లు (క్లోజ్) చూపించింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్లు భావించి పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తడ ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్