logo

Kuppam: సినీనటుడంటూ ప్రచారం.. కుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం గంగవరం మండలం సాయినగర్‌లో ఏర్పాటు చేసిన వైకాపా ప్లీనరీలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘రాష్ట్రంలోని ప్రతి

Updated : 01 Jul 2022 08:45 IST

మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను గజమాలతో సత్కరిస్తున్న పార్టీ నేతలు

పలమనేరు, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం గంగవరం మండలం సాయినగర్‌లో ఏర్పాటు చేసిన వైకాపా ప్లీనరీలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి కులమతాలకు అతీతంగా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి కంటికి కనిపిస్తుంటే చంద్రబాబునాయుడు అభివృద్ధి లేదని అనడం శోచనీయమం. కుప్పంలో సినీనటుడికి సీటు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఇక్కడ భరత్‌ అభ్యర్థిగా ఉంటారు. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో ఏనుగుల సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈసారి పలమనేరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి వెంకటేగౌడకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాల’ని మంత్రి కోరారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీలు భరత్‌, రమేష్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్‌బాబు, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, పలమనేరు పురపాలక ఛైర్‌పర్సన్‌ పవిత్ర, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని