7కు వచ్చింది నాలుగే
విద్యా సంవత్సరం ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో ని పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, మూడు జతల సమవస్త్రాలు, బూట్లు, సాక్సులు, నిఘంటువులను ప్రభుత్వ పాఠశాలల్లో
ఇదీ విద్యాకానుకల సరఫరా పరిస్థితి
చిత్తూరు విద్య, న్యూస్టుడే: విద్యా సంవత్సరం ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో ని పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, మూడు జతల సమవస్త్రాలు, బూట్లు, సాక్సులు, నిఘంటువులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అన్ని యాజమాన్యాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలల పునః ప్రారంభానికి మూడు రోజులే గడువు ఉంది. ఇప్పటి వరకు నాలుగు రకాల విద్యా సామగ్రి అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభం రోజున పూర్తి స్థాయిలో విద్యా కానుకలు విద్యార్థులకు అందించలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో జగనన్న విద్యాకానుకను 1,82,138మంది ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ వివరాల ప్రకారం వీరందరికి పాఠశాల పునః ప్రారంభం రోజున అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జిల్లాకు పూర్తి స్థాయిలో ఏడు రకాల సామగ్రి రాలేదు. కొన్ని పాఠశాలలకు నాలుగు రకాలు, మరికొన్ని పాఠశాలలకు రెండు రకాల సామగ్రి సరఫరా అయ్యింది. మిగిలిన సామగ్రి జిల్లాకు రావాల్సి ఉంది. సామగ్రి వచ్చిన తర్వాత మండల కేంద్రాలకు అక్కడి నుంచి పాఠశాలలకు తరలించాల్సి ఉంది. గత విద్యా సంవత్సరంలో పంపిణీ చేసిన విద్యాకానుకలో కొన్ని రకాలు నాసిరకం సామగ్రి అందజేశారని పలు ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది అటువంటి సామగ్రి సరఫరా చేస్తే వెంటనే సంబంధిత వాహనంలోనే తిరిగి పంపించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యా సామగ్రికి బయోమెట్రిక్
విద్యార్థులకు అందజేయనున్న కానుక కోసం సంబంధిత తల్లులు/ సంరక్షకులు బయోమెట్రిక్ హాజరు వేసిన తర్వాత ఆ సామగ్రిని తీసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్కు అవసరమైన యంత్రాలు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు. శనివారం విద్యా కానుకలో ఇంకా రావాల్సిన సామగ్రి సరఫరా అవుతుందని, ఆదివారం మండల కేంద్రాలకు వాటిని పంపించి అక్కడి నుంచి పాఠశాలలు సరఫరా చేస్తామని విద్యాశాఖ పేర్కొంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.