ఆ కర్షకులు.. ఆదర్శకులు
పంటలకు చీడపీడలు సోకితే ఏ రైతైనా తొలుత తనకున్న అనుభవంతో క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తారు. అప్పటికీ నశించకపోతే వేల రూపాయలు ఖర్చు చేసి పురుగు
స్ఫూర్తిగా నిలిచినచెల్దిగానిపల్లె రైతులు
చెల్దిగానిపల్లె సహకార రైతులకు సూచనలు ఇస్తున్న శాస్త్రవేత్తలు
ఈనాడు డిజిటల్, చిత్తూరు: పంటలకు చీడపీడలు సోకితే ఏ రైతైనా తొలుత తనకున్న అనుభవంతో క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తారు. అప్పటికీ నశించకపోతే వేల రూపాయలు ఖర్చు చేసి పురుగు మందుల దుకాణ విక్రయదారుడి సలహా మేరకు క్రిమి సంహారకాలు వాడతారు. అతి తక్కువ మంది రైతులు మాత్రమే వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది వద్దకు వెళ్లి వారి సూచనల మేరకు మందులు వినియోగించి పంటలను కాపాడుకుంటారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె రైతులు మాత్రం ఇందుకు భిన్నమైన పంథాను అనుసరిస్తూ అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలపై దశాబ్దాల పాటు పరిశోధన చేసి.. బోలెడంత అనుభవం సాధించిన శాస్త్రవేత్తలనే తమ గ్రామానికి రప్పించుకుంటున్నారు. పొలాల్లోనే పాఠాలు చెప్పించుకుంటున్నారు. తద్వారా సేద్యంలో పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గాయి.. దిగుబడులు పెరిగాయి. వీటికితోడు మార్కెటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడంతో ఒకప్పుడు అప్పులపాలైన రైతులు ఇప్పుడు లాభాల బాట పట్టారు.
సంఘమే శాస్త్రవేత్తలకు ఫీజులు చెల్లించి
అంతంతమాత్రమే వర్షాలు పడే కుప్పం నియోజకవర్గంలో సాగు అంటే కష్టాలతో కూడుకున్న వ్యవహారం. రూ.లక్షలు వెచ్చించి వేలాది అడుగుల్లో బోర్లు తవ్వినా నీళ్లు పడతాయా? అన్నది సందేహమే. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో నీటి వాడకాన్ని తగ్గించేందుకుగాను 1997లో తొలుత కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లెలో అప్పటి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ప్రయోగాత్మకంగా ఇజ్రాయెల్ సాంకేతికతను పరిచయం చేశారు. ఈ విధానం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇదే సమయంలో చెల్దిగానిపల్లె రైతులను ప్రభుత్వం సంప్రదాయ పంటల నుంచి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే 2003లో 17 మంది రైతులతో కలిసి ‘చైతన్య రైతు మిత్ర’ గ్రూపును ప్రారంభించగా.. కొంతకాలానికి పక్క మండలాల్లోని కర్షకులను కలుపుకొని ‘చెల్దిగానిపల్లె ఉద్యాన రైతుల పరస్పర సహాయక సహకార సంఘం’ను ఏర్పాటు చేశారు. ఒక్కో రైతు నుంచి సభ్యత్వ రుసుము రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘం ఆధ్వర్యంలోనే చెల్దిగానిపల్లెలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు-మూడు సార్లు బెంగళూరు నుంచి శాస్త్రవేత్తలు వచ్చి సాగులో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకుగాను రూ.4 వేలు ఖర్చవుతుండగా సంఘమే ఈ ఫీజును చెల్లిస్తోంది. శాస్త్రవేత్తలను అన్నదాతలు ‘మొక్కల వైద్యులు’గా సంబోధించడం కొసమెరుపు. పంటలకు చీడపీడలు సోకితే అన్నదాతలు మొక్క ఫొటో తీసి శాస్త్రవేత్తలకు వాట్సప్ చేస్తున్నారు. వారు అక్కడి నుంచే ఏ రసాయనాలు వాడాలనే అంశంపై సూచనలు ఇస్తుంటారు. సందేహాలుంటే వీడియో కాల్ ద్వారా నివృత్తి చేస్తున్నారు. దీంతో రసాయనాలపై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గి లాభాలు కళ్ల జూస్తున్నామని రైతులు అంటున్నారు.
ఏ సందేహాలున్నా వెంటనే సంప్రదిస్తాం
గతంలో మా గ్రామంలో వ్యవసాయం చేసి చాలా వరకు నష్టపోయాం. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో వలస వెళ్లాం. చెల్దిగానిపల్లె ఉద్యాన రైతుల పరస్పర సహాయక సహకార సంఘం ద్వారా మా స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. పంటలపై ఎటువంటి సందేహాలున్నా శాస్త్రవేత్తలతో నివృత్తి చేసుకుంటున్నాం. విభిన్న పంటలు పండిస్తున్నాం. దుకాణదారుల సూచనల మేరకు వేలాది రూపాయల మందులు ఇప్పుడు కొట్టడం లేదు. ఫలితంగా పెట్టుబడులు తగ్గాయి. వినూత్న విధానాలు అనుసరిస్తుండటంతో ఆదాయమూ పెరిగింది.
- ఉమాపతి, సహకార సంఘం అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ