వైభవంగా శ్రీషిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ
చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయంలో గురువారం సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన, విమాన కలశస్థాపనను రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువులు మేధావులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు
స్వామివారికి హారతి సమర్పిస్తున్న మోహన్బాబు, చిత్రంలో కుటుంబసభ్యులు
చంద్రగిరి, న్యూస్టుడే: చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయంలో గురువారం సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన, విమాన కలశస్థాపనను రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువులు మేధావులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా ఉదయం యాగశాలలో గణపతిపూజ, యజ్ఞ, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్బాబు కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి దివ్యాభరణాలు, ప్రత్యేక పూజా సామగ్రిని మేళతాళాలతో తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మోహన్బాబు మాట్లాడుతూ.. దైవానుగ్రహంతో ఇన్నాళ్లకు నా కోరిక ఫలించిందని, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయం నిర్మించడం బాబా కృపతోనే సాధ్యమైందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడి సాయినాథుని దర్శించుకోవాలని కోరారు. పలువురు దాతల సహకారంతో దేవాలయంతో పాటు ధ్యానమందిరం నిర్మించామన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ గవర్నర్ సుశీల్కుమార్షిండే దంపతులు మోహన్బాబు దంపతులకు పట్టువస్త్రాలు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతి, ఎమ్మెల్యేలు కరుణాకర్రెడ్డి, పద్మావతి, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, తితిదే ఈవో ధర్మారెడ్డి, శాంతాబయోటెక్ ఛైర్మెన్ వరప్రసాద్, సినీ దర్శకులు బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గోపాల్రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, ముక్కామల శ్రీధర్స్వామి, షిరిడీ నుంచి వచ్చిన రుత్వికులు, వేదపండితులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్