కలియుగ నాథుని వేడుక.. రారండి కానగ..!
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. కరోనా అనంతరం భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలు భారీగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో స్వామివారి వాహనసేవలను దర్శించుకునేందుకు భక్తులు రానున్నారు.
భక్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు
రేపు అంకురార్పణ
శ్రీవారి ఆలయంపై దశావతారాల విద్యుత్తు సెట్టింగ్
తిరుమల, న్యూస్టుడే: కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. కరోనా అనంతరం భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలు భారీగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో స్వామివారి వాహనసేవలను దర్శించుకునేందుకు భక్తులు రానున్నారు. గరుడోత్సవం రోజున ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకోనున్నారని అంచనాతో దాదాపు ఆరు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. తితిదే, పోలీసు, రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ఆలయ మాడవీధుల్లో గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సిద్ధం చేశారు. మాడవీధుల్లోకి క్యూలైన్ల ద్వారా ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
లేపాక్షి కూడలి సమీపంలో విద్యుత్ అలంకరణ
* బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు అంగరంగవైభవంగా జరగనున్నాయి. శ్రీనివాసుని అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యేలా తితిదే ముహూర్తం నిర్ణయించింది. ధ్వజారోహణానికి ముందురోజు సాయంకాలం సోమవారం భగవన్నారాయణుని సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం అంకురార్పణ జరుగుతుంది.
రాంభగీచా కూడలిలో విద్యుత్ అలంకరణ
* మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మాడవీధుల్లో పెద్దశేషవాహనంలో ఊరేగే ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. ఈ ఘట్టంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
* బ్రహ్మోత్సవాల వేళ తిరుమలక్షేత్రం విద్యుత్తు కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. తితిదే ఉద్యాన, విద్యుత్శాఖలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు పూర్తిచేశాయి. కల్యాణ వేదికలో ఫల, పుష్పప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ప్రత్యేకంగా అనంతపద్మనాభస్వామి నమూనాతో సెట్టింగ్, ఆలయానికి శ్రీవారి పలు అవతారాలు ఏర్పాటు చేస్తున్నారు.
పెరటాసి నెల సందడి
పెరటాసి మాసం సందర్భంగా శనివారం శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రద్దీ నెలకొంది. తొలి శనివారం సందర్భంగా శ్రీనివాసమంగాపురం వద్ద శ్రీవారి ధర్మరథాలు, వాహనాల్లో భక్తులు కిక్కిరిసి వెళ్తూ కన్పించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ కాలినడకన తిరుమలకు వెళ్లారు. - ఈనాడు, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి