logo

16 గంటల్లో భక్తులకు దర్శనం

శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఎస్‌ఎంసీ వరకు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం 16 గంటలకుపైగా పడుతున్నట్లు తితిదే ప్రకటించింది.

Published : 25 Sep 2022 02:31 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఎస్‌ఎంసీ వరకు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం 16 గంటలకుపైగా పడుతున్నట్లు తితిదే ప్రకటించింది. శుక్రవారం 65,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.4.44 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 28,416 మంది తలనీలాలు సమర్పించారు. గదుల కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని