గదుల ఆధునికీకరణకు నిధుల కేటాయింపు
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం గదుల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో ఛైర్మన్ ఆధ్వర్యంలో బోర్డు సభ్యుల సమావేశం శనివారం జరిగింది.
ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం రూ.25 కోట్లు : తితిదే ఛైర్మన్
మాట్లాడుతున్న తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి
తిరుమల, న్యూస్టుడే: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం గదుల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో ఛైర్మన్ ఆధ్వర్యంలో బోర్డు సభ్యుల సమావేశం శనివారం జరిగింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు వసతి సదుపాయం పెంపులో భాగంగా గదుల్లో రూ.7.20 కోట్లతో గీజర్లను ఏర్పాటు చేయడంతోపాటు ఫర్నిచర్, నందకంలోని 340 గదుల్లో నూతన ఫర్నిచర్ ఏర్పాటుకు రూ.2.45 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వకుళమాత ఆలయం నుంచి జూపార్కు రోడ్డుకు కనెక్టివిటీ రింగ్రోడ్డును నిర్మించేందుకు రూ.30 కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. తితిదే క్లాస్-4 ఉద్యోగులకు యూనిఫామ్ కోసం నగదుకు బదులుగా క్లాత్ కొనుగోలుకు రూ.2.50 కోట్లు కేటాయించినట్లు వివరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో తరగతుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు మంజూరుకు బోర్డు తీర్మానించిందని వివరించారు. భవిష్యత్లో తితిదే ఉద్యోగుల అవసరాల కోసం వడమాలపేట వద్ద 132 ఎకరాలను సేకరించేందుకు రూ.25 కోట్లు కేటాయించేందుకు బోర్డు సభ్యులు తీర్మానించారని వెల్లడించారు.
విభాగాల వారీగా ఈవో సమీక్ష
బ్రహ్మోత్సవాలకు విభాగాల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్షించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు. గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యహరించాలని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. జేెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిశోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్కుమార్, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ2 జగదీశ్వర్రెడ్డి, తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.