ఆయన ఆదేశించారు.. వీరు మార్చేశారు
అది చిత్తూరు నగరంలోని మురకంబట్టు నుంచి చెర్లోపల్లి వరకు వెళ్లే బైపాస్ రహదారి.. తిమ్మసముద్రం రెవెన్యూ గ్రామం.. అక్కడ ఎకరా విలువ రూ.కోట్లలోనే ఉంటుంది.. దీనికి సమీపంలోనే నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి సమీప బంధువుకు డీకేటీ భూమి ఉంది.. తన భూమిలో వెంచర్ వేయాలనుకున్నారు.
కీలక ప్రజాప్రతినిధి బంధువు కోసం ఎఫ్ఎంబీ తారుమారు
నామమాత్రపు విచారణతో చేతులు దులుపుకొన్న వైనం
అది చిత్తూరు నగరంలోని మురకంబట్టు నుంచి చెర్లోపల్లి వరకు వెళ్లే బైపాస్ రహదారి.. తిమ్మసముద్రం రెవెన్యూ గ్రామం.. అక్కడ ఎకరా విలువ రూ.కోట్లలోనే ఉంటుంది.. దీనికి సమీపంలోనే నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి సమీప బంధువుకు డీకేటీ భూమి ఉంది.. తన భూమిలో వెంచర్ వేయాలనుకున్నారు. అయితే కొంత భూమిలో వెంచర్ వేస్తే గిట్టుబాటు కాదని ఆలోచించారు. చుట్టుపక్కల ఉన్న డీకేటీ, పట్టా భూములనూ కలిపేస్తే వెంచర్ను వేసేయొచ్చని భావించి చకచకా పావులు కదిపారు.
ఈనాడు డిజిటల్, చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని తిమ్మసముద్రం రెవెన్యూలో కీలక ప్రజాప్రతినిధి బంధువుకు గతంలో డీకేటీ పట్టా ఇచ్చారు. ఇక్కడ ఎకరా రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. ఇప్పుడు అక్కడ వెంచర్ వేయాలని ప్రజాప్రతినిధి బంధువు భావించి ఈ ఏడాది జులైలో గ్రామ కొలతల పటంలో తాత్కాలికంగా (టెంటేటీవ్) మార్పు చేశారు. దీంతో అతని అనుభవంలోకి అదనంగా మరో 15 సెంట్లు చేరాయి. మరో వ్యక్తికి చెందిన మరికొంత భూమి కూడా సదరు ప్రజాప్రతినిధి బంధువు ఖాతాలో చేరింది. వీటికి సమీపంలో సుమారు రెండు ఎకరాల గయ్యాళి భూమి కూడా ఉండటంతో దాన్ని కూడా కలుపుకోవాలని ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికితోడు ప్రైవేటు వ్యక్తుల అనుభవంలో ఉన్న ఆరు ఎకరాలను నయానో భయానో లాక్కుందామనే ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా 15 ఎకరాల్లో వెంచర్ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎఫ్ఎంబీ మార్పుపై తమను సంప్రదించకుండానే మార్పులు చేశారని భూమి కోల్పోయిన బాధితులు ఆర్డీవో, కలెక్టర్ ఎదుట గోడు వినిపించారు. ఓ సర్వేయర్, కొందరు రెవెన్యూ సిబ్బంది ఇందులో కీలక పాత్ర పోషించారని వారు చెబుతున్నారు. సదరు ప్రజాప్రతినిధి బంధువుకు మేలు చేసేందుకు తమకు అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఎఫ్ఎంబీ మార్పుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో అదేరోజు సాయంత్రం ఆగమేఘాలపై రెవెన్యూ, సర్వే సిబ్బంది కదిలినా ఆ తర్వాత మిన్నకుండిపోయారు. వారి మౌనానికి కారణమేంటనే చర్చ రెవెన్యూ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.
ఏం చేశారంటే..
పెద్ద వెంచర్ వేసేందుకు తొలుత ప్రజాప్రతినిధి బంధువు తన స్థలానికి సమీపంలోని భూమిపై కన్నేశారు. కీలక ప్రజాప్రతినిధి ఒత్తిడి తేవడంతో యంత్రాంగం మూడు దశాబ్దాలుగా ఉన్న గ్రామ కొలతల పటం (ఎఫ్ఎంబీ)ని మార్చేసింది. భూములు కోల్పోయినవారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్వే చేయాలని ఆయన ఆదేశించడంతో నామమాత్రంగా విచారణ చేసినట్లు సమాచారం.
సర్వే చేసి.. స్థలం చూపాలని ఆదేశించాం
ఎఫ్ఎంబీ మార్పు వ్యవహారం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరపాలని సర్వే శాఖ సిబ్బందికి సూచించాం. సర్వే చేసి బాధితులకు స్థలం చూపాలని ఆదేశించాం. మరోసారి ఈ అంశంపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేస్తాం.
- రేణుక, ఆర్డీవో, చిత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?