logo

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో విద్యార్థుల ప్రతిభ

నెల్లూరులో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంటులో ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ చాటారని అకాడమీ ఛైర్మన్‌ శేషారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాటితోపు వద్ద ఉన్న

Published : 30 Sep 2022 02:19 IST

ఎంపికైన విద్యార్థులతో ఎస్వీ డిఫెన్స్‌ అకాడమి ఛైర్మన్‌ శేషారెడ్డి

తిరుపతి (గ్రామీణ), న్యూస్‌టుడే: నెల్లూరులో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంటులో ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ చాటారని అకాడమీ ఛైర్మన్‌ శేషారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాటితోపు వద్ద ఉన్న కళాశాలలో ఆర్మీ రిక్రూట్‌మెంటులో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నెల్లూరులో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించారని, ఇందులో శారీరక, వైద్య పరీక్షల్లో 174 మంది విద్యార్థులు ఎంపికై కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు మా విద్యార్థులు త్రివిధ దళాల్లో 5203 మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని