అత్యవసరం పేరుతో హారతి కర్పూరం
రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇక్కడి అధికారులు, కౌన్సిల్ సభ్యులు నిబంధనలకు తిలోదకాలు పలుకుతూ
పురపాలికలో నిబంధనలకు తిలోదకాలు
ఇష్టానుసారంగా రూ.లక్షల ఖర్చు
సూళ్లూరుపేట పురపాలక సంఘం కార్యాలయం
సూళ్లూరుపేట, న్యూస్టుడే రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇక్కడి అధికారులు, కౌన్సిల్ సభ్యులు నిబంధనలకు తిలోదకాలు పలుకుతూ రూ.లక్షల నిధులను హారతి కర్పూరంలా ఖర్చు చేస్తున్నారు. ఓవైపు అనిశా తనిఖీలు జరిగినా.. మరోవైపు విజిలెన్సు అధికారులు వివరాలు కోరినా, ఉన్నతాధికారులు తరచూ అక్షింతలు వేస్తున్నా.. తమకేమీ కాదులే.. అనే ధైర్యంతో స్థానిక అధికారులు ముందుకెళ్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ పనులకు కేటాయింపులు, చెల్లింపులు చేస్తూ శుక్రవారం కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో 17 నగరపాలక సంస్థలు, స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘాలు 8, సెలక్షన్ గ్రేడు మున్సిపాలిటీలు ఆరు, గ్రేడ్-1 15, గ్రేడు-2 29, గ్రేడు-3 18, నగర పంచాయతీలు 31 వరకు ఉన్నాయి. వీటన్నింటిలో లేని పురపాలన సూళ్లూరుపేటలో మాత్రమే కొనసాగుతోంది. పురపాలక సంఘంలో ఏ విభాగంలో చూసినా లోపాలే! ఇటీవల అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో లోటుపాట్లు వెలుగు చూశాయి. ఫాగింగ్ యంత్రం మరమ్మతుకు గురై ఏడాదిగా మూలనపడినా అది వినియోగంలో ఉన్నట్లు డీజిల్ బిల్లులు దస్త్రాల్లో రాసేస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణంలో పురపాలక అధికారులు ఇచ్చిన నిబంధనలకు తిలోదకాలు పలికి ఇష్టానుసారంగా నిర్మించేస్తున్నారు. ఇదంతా పుర అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పురపాలక సంఘంలో ప్రతి విభాగానికి ఓ అధికారి ఉండగా వారుచేసే పనులను ఇతరులకు అప్పగించడం ఇక్కడ షరామామూలే.. ఎవరైనా కొత్తగా వచ్చిన ఉద్యోగులు వీరి చెప్పినట్లు వినకుంటే వారిని పొమ్మనకుండానే పొగపెట్టం వంటివి చేస్తున్నారు.
పనుల విషయానికి వస్తే..
పురపాలక సంఘంలో అత్యవసర పనులను యుద్ధప్రాతిపదికన చేసుకుని, అనంతరం కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ఇక్కడ అత్యవసరం పేరుతో ఇతర పనులు చేస్తూ.. నిధులను ఖర్చు చేసేస్తున్నారు. ఇలా రూ.లక్ష నుంచి రూ.కోట్ల వరకు వ్యయం చేసేస్తున్నారు. అత్యవసరమంటే.. వరదలు, మరేతర ముప్పు వచ్చి అంధకారంలో ఉన్నప్పుడు, తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న సందర్భాల్లో సంబంధిత పనులు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఇక్కడ పనులు చేసి, బిల్లులు పొందుతున్నారు. శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరగనుండగా ఇందులో 16 అంశాలను అజెండాలో పొందుపర్చారు. అయితే వీటిలో 14 పనులు అత్యవసరం కింద చేసినట్లు చూపారు. అందులో రోడ్లు వేయడం, తదితర పనులు ఉన్నాయి. వీటిని కౌన్సిల్ సమావేశంలో ర్యాటిఫై కింద ఆమోదం పొందేందుకు అజెండాలో చేర్చారు.
సెక్షన్ 49 ఏమి చెబుతుందంటే..
ఛైర్పర్సన్కు సంబంధించి సెక్షన్ 49 అత్యవసర అధికారాలేమిటో వివరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అమలును నిర్ద్దేశించవచ్చు. ప్రస్తుతం ఆ కేటగిరిలో లేనివాటికీ ముందస్తు ఉత్తర్వులతో పనులు చేయించారు.
అత్యవసర పనులకు మాత్రమే చేయాలి
పురపాలక సంఘాల్లో అత్యవసరమైన పనులకు ఛైర్మన్ ముందస్తు ఉత్తర్వులతో నిధులు ఖర్చుచేసే వీలుంది. అయితే తాగునీటి అవసరాలు, ఏదైనా విపత్తులు వచ్చిన సందర్భాల్లోనే ఇది చేయాలి. పనుల వివరాలు పరిశీలిస్తాం.
- శ్రీనివాసరావు, ఆర్డీ, గుంటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?
[ 28-03-2024]
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. -
వృద్ధులు.. దివ్యాంగుల ఓట్లపై వాలంటీర్ల గురి
[ 28-03-2024]
చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది. -
అనిశా వలలో ఆర్ఐ
[ 28-03-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు -
శ్రీవారి సేవలో రామ్చరణ్ దంపతులు
[ 28-03-2024]
శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు -
బకాయిలిస్తేనే మరమ్మతులు
[ 28-03-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. -
విధుల నుంచి వాలంటీర్ తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్-4 వాలంటీర్ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 28-03-2024]
సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మత్తు.. చిత్తు
[ 28-03-2024]
ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. -
రెండో రోజూ హైడ్రామా!
[ 28-03-2024]
రేణిగుంట మండలం పీసీఆర్ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది. -
‘మేం కలిసి పనిచేసినా మంత్రి రోజా ఓడిపోతుంది’
[ 28-03-2024]
నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఈ రంగులు మారవా.. సార్..!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం -
కోడ్ అమలులో నిర్లక్ష్యం...
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. -
యువకుడి ఆత్మహత్య
[ 28-03-2024]
ప్రేమించిన యువతి మాట్లాడక పోవడంతో వింజంకు చెందిన ధనుష్(20) బుధవారం సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. -
తెదేపాలో చేరిక
[ 28-03-2024]
మాజీ కార్పొరేటర్ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై ‘బైండోవర్’ వేధింపులు
[ 28-03-2024]
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
వారికి సిద్ధం.. ప్రజలకు కష్టం
[ 28-03-2024]
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
[ 28-03-2024]
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!