భవితకు భరోసా
చంద్రగిరిలోని బాలికల జూనియర్ కళాశాల ఏటా విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వానికి దాతల సహకారం తోడై వసతులు సమకూర్చుకుంటోంది. ఇక్కడ చదివిన
ఆదర్శం.. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల
దాతల ఔదార్యం
కళాశాల ఆవరణలో పచ్చనిచెట్లు
చంద్రగిరిలోని బాలికల జూనియర్ కళాశాల ఏటా విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వానికి దాతల సహకారం తోడై వసతులు సమకూర్చుకుంటోంది. ఇక్కడ చదివిన విద్యార్థినులు సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నారు. కళాశాలలోని వృత్తి విద్యా కోర్సులు అభ్యసించిన వారు పలు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
న్యూస్టుడే, చంద్రగిరి
చంద్రగిరిలో 1982లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. విద్యార్థినుల సంఖ్య ఏటా పెరుగుతూ.. ప్రస్తుతం 855 మంది చదువుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్ష పలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో కళాశాల 70 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. 1920-21 విద్యా సంవత్సరంలో ఆరుగురు, 1921-22లో పదిమంది ఎంసెట్లో ర్యాంకులు సాధించి ఇంజినీరింగ్ సీట్లు సాధించారు. గతంలో ఇక్కడ చదువుకుని ఎంసెట్లో ర్యాంకులు సాధించిన పూర్వ విద్యార్థినులు ఇంజినీరింగ్ పూర్తిచేసి బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నారు. సంవత్సరం పరీక్షలకు ఆరు నెలలకు ముందు నుంచే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థినులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు.
వృత్తివిద్యా కోర్సులు
కళాశాలలో వృత్తివిద్యా కోర్సులు ప్రవేశపెట్టారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్డబ్ల్యూ)లో శిక్షణ పొందిన విద్యార్థినులు ఏటా సుమారు 20 మంది వరకు రుయా, స్విమ్స్, ప్రసూతి ఆసుపత్రిల్లో నర్సింగ్ కోర్సుల్లో సీట్లు సాధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్స్(ఓఏ), కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ(సీజీటీ)లో ప్రావీణ్యం సాధిచిన విద్యార్థులు ఆయారంగాల్లో రాణిస్తున్నారు.
ఎన్నో వసతులు
రాజన్నట్రస్టు, అమరరాజా బ్యాటరీస్ సంయుక్తంగా 2009లో రూ.15 లక్షలు వెచ్చించి నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించారు. పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్రెడ్డి.. తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్సీ రెడ్డివారి నాథమునిరెడ్డి జ్ఞాపకార్థం రూ.5 లక్షలతో కళావేదిక నిర్మించారు. ప్రిన్సిపల్ జి.రాజశేఖర్రెడ్డి అభ్యర్థనతో గుత్తేదారు రాజులుగారి మనోహర్రెడ్డి రూ.2 లక్షలతో కళాశాలకు ప్రహరి, కళావేదిక ప్రాంగణంలో రూ.3 లక్షల వ్యయంతో గ్రానైట్ ఫ్లోరింగ్ నిర్మించారు. పదవీ విరమణ పొందిన కెమిస్ట్రి అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ మినరల్వాటర్ యంత్రాలను అందించారు. కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖరెడ్డి కళాశాల అభివృద్ధికోసం అధ్యాపకుల్ని భాగస్వాములను చేసి కళాశాల ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న వసతిగృహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ఆధునికీకరించారు. విశ్రాంత హిందీ పండిట్ వెంకటరెడ్డి రూ.లక్ష వెచ్చించి కళాశాల సిబ్బంది, విద్యార్థినుల వాహనాలు ఉంచుకోడానికి రేకుల షెడ్డు నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు