మత్స్యవతారవిందం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యనారాయణుడు దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై మత్స్య నారాయణుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. సూర్యుడు సకల రోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు.
సూర్యప్రభ వాహనంపై నారాయణుడు
స్నపన తిరుమంజనంలో ఉత్సవ మూర్తులకు హారతి
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యనారాయణుడు దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై మత్స్య నారాయణుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. సూర్యుడు సకల రోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతైన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి నర్తన కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
బెంగళూరు కళాకారుల రూపకం
వైభవంగా స్నపన తిరుమంజనం: మధ్యాహ్నం శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు మొదటిసారిగా పిస్తాబాదం, కుంకుమపువ్వుతో మాలలు, కిరీటాలు ధరింపజేశారు. తమిళనాడుకు చెందిన దాతలు రాజేంద్రన్, షణ్ముగ సుందరం, బాలసుబ్రహ్మణ్యం అందించిన విరాళంతో హైదరాబాద్కు చెందిన అంబికా ఫ్లోరా సంస్థ మాలలు తయారు చేసింది. వాహనసేవలో శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బోర్డు సభ్యులు, ఎంపీలు గురుమూర్తి, రెడ్డెప్ప జేెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిశోర్, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్బాబు పాల్గొన్నారు.
రామసేతు ఘట్టాన్ని ప్రదర్శిస్తున్న ముంబయి కళాకారులు
బ్రహ్మోత్సవాల్లో నేడు
శ్రీవారి మహా రథోత్సవం మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వర్ణ అశ్వ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
మైసూరు వాసుల నృత్య ప్రదర్శన
స్నపన తిరుమంజనం సందర్భంగా అత్తిపండ్లు, నేరేడుపండ్లు, పిస్తా-బాదం-యాలకులు, జొన్నలతో చేసిన కిరీటాలు
కుంకుమ పువ్వుతో చేసిన పూలమాలలు చూపుతున్న గార్డెన్ డీడీ శ్రీనివాసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.