logo

బంగారుపాళ్యంలో వ్యక్తి మృతి

బంగారుపాళ్యంలో రెండ్రోజుల కిందట మరణించిన వ్యక్తిని మంగళవారం గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు బంగారుపాళ్యంలో ఉంటున్న ఈశ్వరాచ్ఛారి (65) రెండ్రోజులుగా కనిపించలేదని అతడి స్నేహితుడు శివాచ్ఛారి మంగళవారం ఇంటి వద్దకు వచ్చి..

Published : 05 Oct 2022 05:52 IST

బంగారుపాళ్యం: బంగారుపాళ్యంలో రెండ్రోజుల కిందట మరణించిన వ్యక్తిని మంగళవారం గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు బంగారుపాళ్యంలో ఉంటున్న ఈశ్వరాచ్ఛారి (65) రెండ్రోజులుగా కనిపించలేదని అతడి స్నేహితుడు శివాచ్ఛారి మంగళవారం ఇంటి వద్దకు వచ్చి.. కిటీకిలో నుంచి చూశాడు. ఇంటి లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లో మంచంపై ఈశ్వరాచ్ఛారి రెండ్రోజుల కిందట మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి స్థానిక ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని