వ్యాపార కేంద్రంలా మారిన తితిదే
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కనబడటం లేదని, అదో వ్యాపార కేంద్రంగా తయారైందని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ముక్తకంఠంతో ఆరోపించారు.
ఆస్తులుంటేనే దర్శన భాగ్యమా?
30 మంది పీఠాధిపతుల ఆందోళన
మాట్లాడుతున్న శ్రీయోగిపీఠం పీఠాధిపతి శ్రీయోగి అతిదేశ్వరానంద పర్వతస్వామి
చంద్రగిరి, న్యూస్టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కనబడటం లేదని, అదో వ్యాపార కేంద్రంగా తయారైందని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ముక్తకంఠంతో ఆరోపించారు. విశ్వశాంతి కోసం యాగాలు పూర్తి చేసిన స్వామీజీలు శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరుమలను స్వయంగా పరిశీలించారు. అనంతరం శ్రీనివాస మంగాపురంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం పీఠాధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయ నేతలు, ఆస్తులు ఉన్నవారికి మాత్రమే స్వేచ్ఛగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతోందని ధ్వజమెత్తారు. అలాగైతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామన్నారు. స్వామీజీల దగ్గర కూడా వసూళ్లకు పాల్పడటం బాధాకరమన్నారు. దర్శన ఏర్పాట్ల కోసం ముందుగానే లెటర్ ద్వారా తెలియజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీలు ఎవరైనా సరే ఎలాంటి ఏర్పాట్లు చేయలేమని స్పష్టం చేయడం దారుణమన్నారు. ఆస్తులు ఉంటేనే విలువలిస్తామనడం కచ్చితంగా వ్యాపారమే అవుతుందన్నారు. సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి తితిదేలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతామని తెలిపారు. స్వామీజీలకు, ధర్మప్రచారాలకు, హైందవ సంఘాలకు దర్శన భాగ్యం కల్పించాలని డిమాండు చేశారు.
వివరాలు ఆరా.. తిరుమల: శ్రీవారి ఆలయం వద్ద స్వామీజీల గుంపును పరిశీలించిన తితిదే భద్రతా సిబ్బంది వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. తమకు మహద్వారం ద్వారా తితిదే మర్యాదాలతో శ్రీవారి దర్శనానికి అనుమతించాలని కోరారు. తమకు ఎలాంటి సమాచారం లేదని, అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో స్వామీజీలు శ్రీవారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్