నాడు-నేడు అవస్థలు చూడు
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ పర్యవేక్షణ కొరవడటం.. పనులు చేపట్టడానికి గుత్తేదారులు ఆసక్తి చూపించకపోవడంతో ఆలస్యమవుతోంది.
రెండో దశ పనుల్లో తీవ్ర జాప్యం
వర్షాలతో తడుస్తున్న విద్యార్థులు
ఉరుస్తున్న పెళ్లకూరు మండలం నెలబల్లి జడ్పీ ఉన్నత పాఠశాల
గూడూరు, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ పర్యవేక్షణ కొరవడటం.. పనులు చేపట్టడానికి గుత్తేదారులు ఆసక్తి చూపించకపోవడంతో ఆలస్యమవుతోంది. ప్రభుత్వం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో సేకరించే పరికరాలు మాత్రం మందుగానే వస్తున్నాయి. ఇక్కడ జరగాల్సిన పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. విలీన పాఠశాలల్లో గదుల కొరత వేధిస్తోంది. వర్షాలతో ఎక్కువ పాఠశాలలు ఉరుస్తుండటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండో దశ నాడు-నేడు కింద 2,292 బడుల్ని ఎంపిక చేశారు. ఇందులో 2,284 పాఠశాల్లో హడావుడిగా పనులు మొదలు పెట్టారు. రూ.810 కోట్లు నిధులు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.159 కోట్లు విడుదల చేశారు. ఎంపిక చేసిన జడ్పీ ఉన్నత పాఠశాలలకు నిధులు ఎక్కువగా మంజూరు కాగా.. పునాదులు తీసి పనులు చేపడుతున్నారు. స్టీల్ కొనుగోలు చేసి బెండింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. నెల రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పనులు ఆగిపోయాయి. అంతకు ముందు పనులు మందకొడిగానే సాగాయి. తాజా పరిస్థితుల్లో ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. ఎక్కువ బడుల్లో పూర్తయ్యే పరిస్థితులు కానరావడంలేదు. కొన్ని చోట్ల బడులు పాత వాటిని కొత్త రంగులేస్తున్నారు. పెళ్లకూరు మండలం నెలబల్లి జడ్పీఉన్నత పాఠశాలలో 1986లో నిర్మించిన భవనానికి కొత్త హంగులేర్పాటు చేయనున్నారు. ఈ భవనం పైకప్పు ఉరుస్తోంది.. అయినా దీనికి హంగులు సిద్ధం చేస్తున్నారు.
* గూడూరు మండలంలో రెండో దశ నాడు-నేడు కింద 33 బడుల్ని ఎంపిక చేశారు. ఇందులో అయ్యవారిపాళెం జడ్పీకి రూ.24.94 లక్షలు, దివిపాళెంకు రూ.25.05 లక్షలు, విందూరుకు రూ.23.50 లక్షలు విడుదల చేశారు. ఇతర బడులకు నామమాత్రంగానే నిధులొచ్చాయి. ఎంపిక చేసిన బడుల్లో పనులు ప్రారంభం కాగా కొన్ని చోట్ల పునాదులు దాటలేదు. ఎక్కువ చోట్ల బడులు పాత వాటి స్థానంలో శ్లాబ్లు బాగు చేసి కొత్త హంగులద్దుతున్నారు.
* కుప్పం మండలంలో 93 ప్రభుత్వ బడులు ఎంపిక చేసిన ప్రభుత్వం రూ.5.93 కోట్లు మంజూరు చేసింది. వాసనాడు జడ్పీకి రూ.29.70లక్షలు, కేడీపల్లి జడ్పీకి రూ.22.07 లక్షలు, కనగుడి జడ్పీకి రూ.24.75 లక్షలు విడుదల చేసింది. ఈ పాఠశాలల్లో పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. వస్తు సామగ్రి సిద్ధం చేసుకున్న నిర్మాణదారులు వర్షాలతో ఆపేశారు. ఈ మండలంలో ఎక్కువ బడులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మేర విడుదల చేశారు.
* నాయుడుపేట మండలంలో 47 పాఠశాలలకు రూ.2.53 కోట్లు నిధులు నాడు నేడు కింద మంజూరయ్యాయి. ఇక్కడ ఎల్.ఎ.సాగరం జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.24.30 లక్షలు, కాపులూరుకు రూ.21.86 లక్షలు, పూడేరు జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.21.43 లక్షలు విడుదల కాగా.. తరగతి గదులకు పునాదులు తీసి పెట్టారు. స్టీల్ కొనుగోలు చేసిన నిర్మాణదారులు పునాదులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
వేగంగా చేపట్టడానికి చర్యలు
- శేఖర్, జిల్లా విద్యాధికారి, తిరుపతి
పాఠశాల యాజమాన్య కమిటీలతో పనులు వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో ఇంజినీరింగ్ సహాయకులతో పర్యవేక్షణ ఉంటోంది. వర్షాలతో కాస్త ఆలస్యం అవుతోంది. అయినా లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?