పేదల ఇళ్ల మాటున ఇసుక దోపిడీ
అధికార అండ ఉంటే ఏదో ఒక రూపంలో కాసులు దండు కోవచ్చనడానికి పూతలపట్టు మండలం వావిల్తోట ఇసుక రేవును పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది.
వావిల్తోట రేవు నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా
కీలక ప్రజాప్రతినిధి అండతో అడ్డగోలు వ్యవహారం
నదిలో ఇసుకను ట్రాక్టర్లలో పోస్తున్న పొక్లెయిన్
అధికార అండ ఉంటే ఏదో ఒక రూపంలో కాసులు దండు కోవచ్చనడానికి పూతలపట్టు మండలం వావిల్తోట ఇసుక రేవును పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా ముసుగులో బహిరంగంగా ఇసుక విక్రయిస్తున్నారు. రోజుకు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పొరుగు సేవల సిబ్బంది ఇద్దరు ఉన్నా.. నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి, అధికార పార్టీకే చెందిన మరో మండల స్థాయి నాయకుడు చక్రం తిప్పుతుండటంతో మాట వినకుంటే బదిలీ చేస్తారని వారూ మిన్నకుండిపోతున్నారు. ఫలితంగానే ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, పూతలపట్టు: పేదలకు ఇళ్ల నిర్మాణానికి 40 కిలోమీటర్లలోపు ఇసుక రేవులు ఉంటే లబ్ధిదారులు అక్కడకు వెళ్లి ఉచితంగా తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ దూరం ఉంటే ఇసుక తవ్వకం, విక్రయాలు చేస్తున్న జేపీ సంస్థే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పూతలపట్టు మండలం నీవా నది పరివాహకంలోని వావిల్తోట రేవులో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఇచ్చిన కూపన్లు చూపించాలని పేర్కొన్నారు. నాడు- నేడు పనులకు మాత్రం స్టాక్ పాయింట్ నుంచి తరలించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగాఈ రీచ్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి.
ఒకే కూపన్పై నాలుగైదు సార్లు
సమాధుల మధ్య ఏర్పాటు చేసుకున్న దారి
పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఇచ్చిన ఒకే కూపన్పై నాలుగైదు ట్రాక్టర్ల మేర ఇసుకను తరలిస్తున్నారు. ఇటువంటి అక్రమాలు జరగకుండా రీచ్ వద్ద అవసరమైన సిబ్బంది, పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించినా ఇవేవీ అమలు కావడంలేదు. నామమాత్రంగా ఇద్దరు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
రోజుకు 300కుపైగా ట్రిప్పులుతరలిస్తూ..
జగనన్న కాలనీల్లోని ఇళ్ల పేరిట ఇతరులకూ ఇసుక విక్రయిస్తున్నారు. రోజుకు 40కుపైగా ట్రాక్టర్లతో రోజుకు 300కుపైగా ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. ఇందులో 40 శాతం వరకే అధికారికంగా ఉంటున్నాయని, మిగిలిన 60 శాతం అక్రమంగా తోలుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.4వేలు- రూ.5వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.
ప్రజలు ప్రశ్నిస్తున్నా..
ఒకట్రెండు సందర్భాల్లో సమీప గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో అధికారులు, సిబ్బంది ఈ వ్యవహారాన్ని ప్రశ్నించారు. దీంతో పూతలపట్టు నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి తాను చెప్పినట్లు వినాల్సిందేనని హెచ్చరించారు. లేదంటే బదిలీలు తప్పవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారు కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
చర్యలు తీసుకుంటాం: పూతలపట్టు మండలం వావిల్తోట రీచ్లో ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే ఇసుక తవ్వుకోవాలని అనుమతులు ఇచ్చారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
రిషాంత్రెడ్డి, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!