ఇళ్లు.. అనుమానాల లోగిళ్ళు
ఇవి పేదల కోసం శ్రీకాళహస్తి రాజీవ్నగర్ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లు. నిర్మించి ఏళ్లు గడిచినా మరికొన్ని పనులు ముందుకు సాగక కట్టిన నిర్మాణాలు శిథిలమైపోతున్నాయి.
వచ్చే ఏడాదే పంపిణీ
కొన్ని బ్లాకుల వద్దే అభివృద్ది
శిథిలమైపోతున్న నిర్మాణాలు
వర్షాలకు తుప్పుపట్టిన ఇనుము
ఇవి పేదల కోసం శ్రీకాళహస్తి రాజీవ్నగర్ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లు. నిర్మించి ఏళ్లు గడిచినా మరికొన్ని పనులు ముందుకు సాగక కట్టిన నిర్మాణాలు శిథిలమైపోతున్నాయి. వర్షాలకు పాచిపట్టడమే కాకుండా శ్లాబ్ ఏర్పాటుకు సిద్ధం చేసిన ఇనుప కమ్మీలు తుప్పుపట్టి నిరుపయోగంగా మారుతున్నాయి.
శ్రీకాళహస్తి, న్యూస్టుడే: స్థానిక రాజీవ్నగర్ వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు మళ్లీ కాస్తంత వేగం అందున్నాయి. ప్రస్తుతం ఏడు బ్లాకులకు మాత్రం వైకాపా రంగులు వేయడమే కాకుండా అంతర్గత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బ్లాకుల మధ్య రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు. అంతర్గత రోడ్లను ఓ వైపు శ్రీకాళహస్తి-పిచ్చాటూరురోడ్డుకు, మరో వైపున దేవునిబాట రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు.
రాజీవ్నగర్ వద్ద నిర్మాణం పూర్తయిన గృహాలకు వేసిన వైకాపా రంగులు
మళ్లీ.. మార్చికేనా..?
రూ.500 చెల్లించి ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వారికి ఇళ్ల నిర్మాణాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పక్కా ఇళ్లు ఈ ఏడాది ఆఖరుకు అందుబాటులోకి వస్తాయని లబ్ధిదారులు ఆశపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్చి వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తయినవి కేవలం 816 ఇళ్లు మాత్రమే. తొలి విడతలో నిర్మించాల్సినవి 2,144 ఇళ్లు కాగా మిగిలిన కాలం మూడు నెలలు మాత్రమే.
శిథిలమైపోతున్న కట్టడాలు
పంపిణీపైనే సందేహాలురాజీవ్నగర్ సమీపంలో దాదాపు 20 బ్లాకులకు పైగా నిర్మాణాలు జరిగాయి. వీటిల్లో కేవలం ఏడు బ్లాకులకు రంగులు వేశారు. అంతర్గత రహదారి పనులు చేస్తున్నారు. సిద్ధమవుతున్న ఇళ్లను ఏ విధంగా.. తొలి ప్రాధాన్యం ఎవరికి ఇస్తారన్నది లబ్ధిదారుల్లో పలు సందేహాలకు తావిస్తోంది. అయినవాళ్లకు ఆకుల్లో.. కాని వాళ్లకు కంచాల్లో అన్నట్లు.. తొలి ప్రాధాన్యం ఏ విధంగా అనే విషయమై లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
తొలి విడత దరఖాస్తులు: 4,064
తొలి విడత నిర్మాణాలు: 2144
పట్టాల పంపిణీ: 3000
రిజిస్ట్రేషన్ చేయించింది: 1500
పూర్తయిన నిర్మాణాలు: 816
అర్హులైన వాళ్లందరికీ ఇళ్లు
అర్హులైన వారందరికీ టిడ్కో ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం తొలి కేటగిరిలోని ఇళ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తయిన తర్వాత రెండో కేటగిరి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురానున్నాం.
బాలాజీనాయక్, కమిషనర్, శ్రీకాళహస్తి పురపాలక సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!
[ 18-04-2024]
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు. కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. -
కర్ణాటక మద్యం తరలిస్తూ...
[ 18-04-2024]
కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ విధ్వంస రచన!
[ 18-04-2024]
నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. -
పస్తులతో పనులు చేస్తున్నాం
[ 18-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. -
20న చంద్రబాబు పర్యటన
[ 18-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. -
జడ్పీలో లేకున్నా అతనే కీలకం
[ 18-04-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. -
సమగ్ర శిక్షే
[ 18-04-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. -
ఇంట్లో దూరింది నిజమే..
[ 18-04-2024]
జడ్పీ నోడల్ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్ఛార్జి ఎంపీడీవో రాజేష్, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. -
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు