నీటిశుద్ధి యంత్రాలున్నాయంతే..!
విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకుతోడు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, అభ్యసన సామ ర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటిస్తోంది..
మరమ్మతులకు గురైనా స్పందించని నిర్వాహకులు
ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు
1213 - నాడు-నేడు తొలివిడత ఎంపికైన పాఠశాలలు
రూ.424 కోట్లు - చేసిన వ్యయం
ఈనాడు డిజిటల్, చిత్తూరు: విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకుతోడు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, అభ్యసన సామ ర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటిస్తోంది.. ఇందుకోసం కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్నామని, ఎన్ని నిధులు వెచ్చించ డానికైనా సిద్ధంగా ఉన్నామని వెల్లడిస్తోంది.. ఇన్ని నిధులు వెచ్చించినా క్షేత్రస్థాయిలో మాత్రం కొన్నిచోట్ల సమస్యలు తీరడంలేదు.
నాడు- నేడులో భాగంగా పాఠశాలల్లో నెలకొల్పిన నీటి శుద్ధి యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.. వాటిని బాగు చేయించినా కొన్ని రోజులకే మూలన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ సమస్య గురించి ఏజెన్సీ నిర్వాహకులకు ప్రధానోపాధ్యాయులు చెప్పినా వారి నుంచి సమాధానం రావడంలేదని అంటున్నారు. రేపు మాపు అంటున్నారే తప్పా పాఠశాలల వైపు చూడటంలేదని బాధ పడుతున్నారు.
జిల్లాలోని పడమటి మండలాల్లో మూడేళ్ల క్రితం వరకూ నీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్థులు ట్యాంకరు నీటి కోసం పనులు మానేసి నిరీక్షించారు. పాఠశాలల్లో బోర్లు వేసినా కొంతకాలానికి నీరు రాకపోవడం, కొన్నిచోట్ల అంతంతమాత్రంగానే వస్తుండటంతో ఆ అరకొరా నీటితోనే గొంతు తడుపుకునే దుస్థితి. కొన్ని ప్రాంతాల్లో సమస్య నుంచి గట్టెక్కించేందుకు క్యాన్ల ద్వారా నీళ్లు ఇవ్వడంతో కొంతమేరైనా ఇక్కట్లు తప్పాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ‘నాడు- నేడు’ ద్వారా బడుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొంది. ప్రధానంగా తాగునీటి ఎద్దడిని పరిష్కరిస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నీటి సదుపాయం లేనిచోట లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేసింది. మరమ్మతులకు గురైతే ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం ఇస్తే వెంటనే చక్కదిద్దుతారని ప్రకటించింది.
బాగు చేయకపోవడంతో మూలకు..
కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తరచూ యంత్రాలు పాడైపోతున్నాయి. వీటిని బాగు చేయించాలని ప్రధానోపాధ్యాయులు ఏజెన్సీలకు చెబుతున్నా ఒకట్రెండు సార్లు వచ్చి మరమ్మతులు చేశారు. తర్వాత వారి జాడే లేకుండా పోయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. దీంతో నీటి శుద్ధి యంత్రాలను పాఠశాలల్లోనే ఓ మూలన పడేశారు. విద్యార్థులు ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల మాత్రం ఉపాధ్యాయులు చొరవ తీసుకుని క్యాన్ల ద్వారా నీళ్లు తెప్పిస్తున్నారు. ఆ ఖర్చులనూ వారే భరిస్తున్నారు.
* కుప్పం మండలం గోనుగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 320 మంది విద్యార్థులున్నారు. ‘నాడు- నేడు’ మొదటి విడతలో భాగంగా ఇక్కడ విద్యా ర్థులకు శుద్ధినీరు అందిం చేందుకు ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. వారం రోజులకు మరమ్మతులకు గురికావడంతో ఓ గదిలో ఉంచేశారు. అప్పటి నుంచి విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధిక శాతం మంది ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నారు. మరమ్మతులకు గురైన విషయాన్ని ఉపాధ్యాయులు.. ఏజెన్సీ నిర్వాహకులకు చెప్పినా ఒకసారి బాగు చేయించారు. మరికొన్ని రోజులకు తిరిగి సమస్య మొదలైంది.
* కుప్పం పట్టణం పాతపేట ప్రాథమిక పాఠశాలలో 117 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం మరమ్మతులకు గురవడంతో క్యాన్లలో నీరు తెచ్చి విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్