logo

వైకాపా నాయకులు దౌర్జన్యం చేశారంటూ నిరసన

వైకాపా నాయకులు అక్రమంగా తమ గ్రామ కంఠంలో ఇంటి స్థలాలు కేటాయిం చేందుకు దౌర్జన్యంగా చర్యలు చేపట్టారని ఆరోపిస్తూ మండలంలోని అయినంబాకంలో గ్రామస్థులు శుక్రవారం నిరసన చేపట్టారు

Published : 26 Nov 2022 06:19 IST

నగరి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు అక్రమంగా తమ గ్రామ కంఠంలో ఇంటి స్థలాలు కేటాయిం చేందుకు దౌర్జన్యంగా చర్యలు చేపట్టారని ఆరోపిస్తూ మండలంలోని అయినంబాకంలో గ్రామస్థులు శుక్రవారం నిరసన చేపట్టారు. గ్రామ కంఠంలోని నీళ్లగుంటను చదును చేసి ఇతర గ్రామాల ప్రజలకు ఇంటిపట్టాలు కేటాయించే సాకుతో ఆక్రమించే యత్నం చేశారని ఆరోపించారు. అధికారులను ఒత్తిడి చేసి గుంట పొరంబోకును చదును చేసేందుకు యత్నించారన్నారు. భవిష్యతులో ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉన్న ఈ స్థలంలో ఇతర గ్రామాల వారికి ఇంటి స్థలాలు కేటాయించడానికి సర్వే చేసి చదును చేస్తున్నారని, దీన్ని అడ్డుకున్న తమపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇది  ఇతరులకు ఇస్తే భవిష్యతులో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులు దీన్ని నిలువరించాలంటూ నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు