సెజ్ బాహ్య రహదారికి మోక్షం
పారిశ్రామికవాడ బాహ్య రహదారి విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి రానుంది. నాయుడుపేట ఇండస్ట్రీయల్ క్లస్టర్కు 2018లో ఏడీబీ సాయంతో రోడ్డు ఏర్పాటుకు అనుమతి లభించింది.
రూ.161 కోట్లతో విస్తరణ
పండ్లూరు వద్ద ఆర్వోబీ
విస్తరించనున్న రహదారి
గూడూరు, న్యూస్టుడే: పారిశ్రామికవాడ బాహ్య రహదారి విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి రానుంది. నాయుడుపేట ఇండస్ట్రీయల్ క్లస్టర్కు 2018లో ఏడీబీ సాయంతో రోడ్డు ఏర్పాటుకు అనుమతి లభించింది. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) ఆధ్వర్యంలో అప్పట్లో హద్దులు, భూసేకరణ ప్రక్రియలు చకచకా సాగాయి. కొందరు రైతులు పొలాలు ఉన్నాయని కోర్టును ఆశ్రయించడంతో కొంత మేర అలైన్మెంట్ మారింది.
నాయుడుపేట ఇండస్ట్రియల్ క్లస్టర్కు 8.7 కి.మీ మేర నాలుగు వరుసల బాహ్య రహదారికి రూ.161 కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడి నుంచి రోజూ 2,500 వాహనాలు రాకపోకలు చేస్తున్నాయి. నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లోని భూముల్లో ప్రత్యేక అర్థిక మండలి, పారిశ్రామిక పార్కులకు 5 వేల ఎకరాలు కేటాయించారు. ఇప్పటికే కొన్ని భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీంతో ఇక్కడికి బాహ్య రహదారి అవసరాన్ని గుర్తించారు. తెదేపా హయాంలో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. తాజాగా ఏడీబీ నుంచి నిధులు పక్కకు మళ్లే పరిస్థితులు రావడంతో ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రహదారి అలైన్మెంట్ మార్చి 8.7 కి.మీ మేర నాలుగు వరుసల నిర్మాణానికి ఏర్పాట్లు చేపట్టారు.
వంతెన ఏర్పాటుపై నిర్ణయం
జాతీయ రహదారి 16 నుంచి పండ్లూరు రైల్వేక్రాసింగ్ దగ్గర వంతెన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెన్నేపల్లి, అయ్యప్పరెడ్డిపాళెం దగ్గర వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మార్గం మార్చిన ర.భ అధికారులు కొత్తగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. పండ్లూరు, అయ్యప్పరెడ్డిపాళెం, ఓజిలి మండలం పెన్పేపల్లి, కొత్తపేట, గ్రద్ధగుంట మీదుగా నాయుడుపేట-రాపూరు రహదారికి అనుసంధానం చేయనున్నారు. కొత్త మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి రానుంది. ఉన్న రహదారిని విస్తరిస్తూ నాలుగు వరుసలు చేయనున్నారు.
ఆదిలోనే అడ్డంకులు
నాయుడుపేటలో గతంలో ఓ రహదారి ప్రతిపాదించగా ఆదిలోనే అడ్డంకులు పడ్డాయి. ఆ మార్గం వదిలి ప్రస్తుతం ఇక్కడ నాలుగు వరుసలతో డివైడర్ ఏర్పాటు చేయనున్నారు. గోమతి నుంచి స్వర్ణముఖి నది వరకు విస్తరించి విద్యుద్దీపాలు అమర్చనున్నారు.
త్వరలో ప్రారంభించే అవకాశం
నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్ బాహ్య రహదారిటెండర్ ప్రక్రియ పూర్తి చేశాం. ఏడీబీ నుంచి అనుమతులు రాగానే పనులు మొదలవుతాయి. కొత్త అలైన్మెంట్ మేరకు పనులు చేపడతాం.
- రామాంజనేయులు, కార్యనిర్వాహక ఇంజినీర్, ర.భ. శాఖ, గూడూరు
పారిశ్రామిక క్లస్టర్ నుంచి ట్రాఫిక్ అంచనా
సంవత్సరం వాహనాలు
2018 1,984
2023 2,887
2228 4,161
2033 5,872
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్