33 రోజులు.. 3 రాకెట్ ప్రయోగాలు
షార్ నుంచి 33 రోజుల వ్యవధిలో మూడు ప్రయోగ వేదికల నుంచి మూడు వేర్వేరు రాకెట్ ప్రయోగాలు చేపట్టి విజయవంతం చేశారు.
నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ-సి54
శ్రీహరికోట, న్యూస్టుడే: షార్ నుంచి 33 రోజుల వ్యవధిలో మూడు ప్రయోగ వేదికల నుంచి మూడు వేర్వేరు రాకెట్ ప్రయోగాలు చేపట్టి విజయవంతం చేశారు. తుపాన్లు, భారీ వర్షాలు, తదితర విపత్తుల నేపథ్యంలో అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తారు. ఈ దఫా ప్రతికూల వాతావరణంలోనూ మూడు రాకెట్లను విజయవంతంగా నింగిలోకి పంపారు. ఈ ఏడాది అక్టోబరు 21 భారీ రాకెట్ ప్రయోగమైన ఎల్వీఎం-3ని నింగిలోకి పంపి, వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను కక్ష్యలో వదిలారు. అలాగే ఈనెల 18న మొట్టమొదటిగా హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన ప్రైవేటు రాకెట్ను ఇక్కడ నుంచే పంపి విజయవంతం చేశారు. ప్రైవేటు రాకెట్ను స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో వారిని ప్రోత్సహించడంతో, అన్నింటా ఇస్రో ముద్రతోనే ముందుకు కదిలారని చెప్పొచ్చు. తాజాగా శనివారం పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి54 వాహకనౌక ద్వారా దేశానికి చెందిన ఓషన్శాట్తోపాటు, మరో 8 నానోశాటిలైట్లు కక్ష్యలో విడిచిపెట్టారు. మూడు రాకెట్ల సమయంలో వాతావరణంలో మార్పులు కనిపించాయి. అయినా శాస్త్రవేత్తలు వెనకడుగు వేయకుండా ముందుకు కదిలి విజయం సాధించారు. మూడు రాకెట్లలోనూ మూడు విభిన్నమైన సాంకేతికలను ఉపయోగించారు. శనివారం చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి54 వాహకనౌక ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు నుంచి 10,342 మంది వచ్చారు.
రాకెట్ ప్రయోగ వీక్షణకు వచ్చిన భూటాన్ దేశీయులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి