‘అవకాశమిస్తే సర్వనాశనం చేశారు’
‘ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. అన్నీ రంగాల వారి నెత్తిన చేయి పెట్టి పాతాళానికి తొక్కేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని’ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు.
నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, తెదేపా శ్రేణులు
గూడూరు పట్టణం, న్యూస్టుడే: ‘ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. అన్నీ రంగాల వారి నెత్తిన చేయి పెట్టి పాతాళానికి తొక్కేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని’ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపం జాతీయ రహదారి వద్ద ఆక్వా పరిశ్రమ ప్రాంతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు జి.నరసింహయాదవ్, అబ్దుల్ అజీజ్, తెదేపా రాష్ట్ర రైతు అధ్యక్షుడు మర్రిరెడ్డి శ్రీనివాసులరెడ్డిలతో కలిసి ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించి మాట్లాడారు. ఆక్వాకల్చర్ ద్వారా చేసే ఉత్పత్తిలో భారతదేశం ప్రథమస్థానంలో ఉందని, అలాంటిది ఏపీలో ఈ సాగును దారుణంగా మార్చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్లు విభజించడంలో అవకతవకలు చేశారని, ప్రభుత్వ జోన్లో రూ.1.50, జోన్ కిందకు రాని వారికి రూ.4.50 చొప్పున యూనిట్కు విద్యుత్తు ధరలు నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ రైతు అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణయాదవ్, చెంచురామయ్య, గుండాల లీలావతి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లురాజు, శ్రీపతిబాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!