logo

అనుమానాస్పద స్థితిలో తెదేపా వార్డు సభ్యుడి మృతి

మండలంలోని 89పెద్దూరు పంచాయతీకి చెందిన 6వ వార్డు సభ్యుడు, తెదేపా మద్దతుదారు ఏలుమలై(27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది.

Published : 27 Nov 2022 04:21 IST

మృతదేహాన్ని దహనం చేసేందుకు తీసుకెళ్తుండగా అడ్డుకున్నట్లు మృతుడి భార్య ఫిర్యాదు

ఏలుమలై (పాతచిత్రం)

రామకుప్పం, న్యూస్‌టుడే: మండలంలోని 89పెద్దూరు పంచాయతీకి చెందిన 6వ వార్డు సభ్యుడు, తెదేపా మద్దతుదారు ఏలుమలై(27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు.. ఎస్‌.గొల్లపల్లికి చెందిన శివగామికి.. ఏలుమలై, గొల్లపల్లికి చెందిన మురుగేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఏలుమలై శివగామి ఇంటికి వెళ్లాడు. శివగామి ఏలుమలై భార్య పవిత్రకు ఫోన్‌ చేసి.. నీ భర్త మా ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడని చెప్పింది. కర్ణాటకలో కూలి పనులు చేసుకుంటున్న పవిత్ర వెంటనే గొల్లపల్లికి బయలుదేరింది. శివగామి, మురుగేష్‌ ఆటోలో ఏలుమలై మృతదేహాన్ని ననియాల అడవిలో తీసుకెళ్తుతుండగా పవిత్ర గుర్తించి అడ్డుకోగా వారు వదిలి పరారయ్యారు. మృతదేహాన్ని శివగామి, మురుగేష్‌ కాల్చివేయడానికి తీసుకెళ్తున్నట్లు పవిత్ర పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఉమామహేశ్వరరెడ్డి వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంతో శివగామితో వివాహేతర సంబంధంపై ఏలుమలై, మురుగేష్‌ మధ్య గొడవలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని