పైరులో ఒరిగి.. రైతుకు దిమ్మెతిరిగి
మండల పరిధిలోని రామేగౌనిపల్లె, సోలిశెట్టిపల్లె సమీపంలో అక్రమ క్వారీల నుంచి రాత్రి వేళ గ్రానైట్ తరలింపు లారీల రాకపోకల వల్ల స్థానిక రైతులకు నష్టాలు తప్పడం లేదు.
గ్రానైట్ అక్రమ తరలింపులో పొలంలో పడ్డ లారీ
వరి పంట, రాతి కంచె ధ్వంసం
రామేగౌనిపల్లె వద్ద అర్ధరాత్రి ఘటన
పొలంలో పడిన గ్రానైట్ దిమ్మెలు
కుప్పం, శాంతిపురం, న్యూస్టుడే: మండల పరిధిలోని రామేగౌనిపల్లె, సోలిశెట్టిపల్లె సమీపంలో అక్రమ క్వారీల నుంచి రాత్రి వేళ గ్రానైట్ తరలింపు లారీల రాకపోకల వల్ల స్థానిక రైతులకు నష్టాలు తప్పడం లేదు. శుక్రవారం అర్ధరాత్రి గ్రానైట్ తరలిస్తున్న లారీ రామేగౌనిపల్లె వద్ద అదుపు తప్పి పంట భూముల్లోకి దూసుకెళ్లడంతో రైతులకు నష్టం వాటిల్లింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సమీప క్వారీ నుంచి రెండు దిమ్మెలతో రామేగౌనిపల్లె వైపు వస్తున్న లారీ వరి పొలంలో ఒరిగింది. దిమ్మెలు పంటలో పడిపోయాయి. రాత్రి వేళలలోనే గ్రానైట్ దిమ్మెలను మరో లారీ ద్వారా తరలించే ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. రైతులు పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న కంచెకు సంబంధించిన రాతి స్తంభాలు నేలమట్టం అయ్యాయి. పంట కూడా దెబ్బతిందని బాధిత రైతులు వాపోయారు.
రాత్రి వేళల్లో యథేచ్ఛగా తరలింపు
క్వారీలకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నట్లయితే.. గ్రానైట్ను పగటి వేళల్లో తరలించవచ్చు కదా..? అని స్థానికులు అంటున్నారు. అనధికారిక క్వారీల్లో పగటి వేళ తవ్వకాలు చేపడుతూ.. అర్ధరాత్రి వేళల్లో రహస్యంగా రాతి దిమ్మెలను తరలించాల్సిన అవసరం ఏమిటి..? అని ప్రశ్నిస్తున్నారు. సోలిశెట్టిపల్లె, రామేగౌనిపల్లె సమీపంలోని కొండల నుంచి నిత్యం రాత్రుల్లో పదుల సంఖ్యలో లారీల ద్వారా గ్రానైట్ తరలింపు సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. లారీలు, ట్రాక్టర్ల రాకపోకల వల్ల రామేగౌనిపల్లె రోడ్డు అధ్వాన స్థితికి చేరుకొందని వాపోయారు. సోలిశెట్టిపల్లె- గెసికపల్లె రోడ్డుతో పాటు కుప్పం- కేజీఎఫ్ రహదారి కూడా దెబ్బతింటోందని పేర్కొన్నారు.
లారీ ధాటికి నేలకూలిన రాతి స్తంభాలు
ఉద్యాన పంటల్లో విపరీతమైన దుమ్ము
గ్రానైట్ వాహనాల ధాటికి రహదారులు గుంతలమయం కావడంతో వాటి రాకపోకల వల్ల సమీప పంట భూముల్లో దుమ్ము పేరుకుపోతోందని రైతులు అంటున్నారు. మట్టి రోడ్లపై వాహనాలు వెళ్లే సందర్భంలో ఉద్యాన పైర్లపై విపరీతమైన దుమ్ము అలముకోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. రాత్రి వేళల్లో గ్రానైట్ లారీలు, ట్రాక్టర్ల రాకపోకల వల్ల శబ్ద కాలుష్యంతో తీవ్ర అసౌకర్యం ఎదురవుతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి