పంచమి తీర్థం.. ప్రణమిల్లిన భక్తజనం
శ్రీపద్మావతీ అమ్మవారి పంచమి తీర్థం సోమవారం కనులపండువగా జరిగింది. ఉదయం ఏడు గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఉత్సవమూర్తిని, చక్రత్తాళ్వారును ఊరేగింపుగా పద్మసరోవరంలోని మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.
లక్షన్నర మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు
స్నపన తిరుమంజనం మండపంలో శ్రీపద్మావతీ అమ్మవారు, చక్రత్తాళ్వారు
తిరుచానూరు, తిరుమల, న్యూస్టుడే: శ్రీపద్మావతీ అమ్మవారి పంచమి తీర్థం సోమవారం కనులపండువగా జరిగింది. ఉదయం ఏడు గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఉత్సవమూర్తిని, చక్రత్తాళ్వారును ఊరేగింపుగా పద్మసరోవరంలోని మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. గజరాజుపై తిరుమల నుంచి తీసుకొచ్చిన సారె, బంగారు ఆభరణాలు, పసుపు, కుంకుమ తదితర అభిషేక ద్రవ్యాలతో అమ్మవారికి, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు లక్షన్నర మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తితిదే అంచనా వేసింది. రాత్రి అలమేలుమంగకు తిరుచ్చి వాహనసేవ నిర్వహించారు. ధ్వజారోహణం రోజున ఎగురవేసిన గజపటాన్ని అవరోహణ చేయడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పంచమి తీర్థంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పాలకమండలి సభ్యులు పోకల అశోక్కుమార్, రామేశ్వరరావు, శ్రీరాములు, మారుతిప్రసాద్, తితిదే మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో సదాభార్గవి, సీవీఎస్వో నరసింహకిషోర్, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పద్మసరోవరంలో భక్తులు
అమ్మవారికి అయ్యవారి సారె : అమ్మవారి చక్రస్నానం కోసం సోమవారం వేకువజామున తిరుమల నుంచి ఈవో ఏవీ ధర్మారెడ్డి తమ సిబ్బందితో కలిసి కాలి నడకన సారె తెచ్చారు. అలిపిరి వద్ద జేఈవో వీరబ్రహ్మానికి అందజేశారు. ఆపై తిరుచానూరు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.
అమ్మవారి హారతి అందుకుంటున్న భక్తులు
రెండు బంగారు పతకాలు కానుక: అమ్మవారి చక్రస్నానం పురస్కరించుకుని తిరుమల నుంచి శ్రీవారి తరఫున రూ.25 లక్షల విలువ చేసే రెండు బంగారు పతకాలు, ఒక హారాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తీసుకొచ్చి ఆలయ అధికారులకు అందజేశారు. చక్రస్నానం సమయంలో జరిగిన స్నపన తిరుమంజనంలో బంగారు పతకాలు ధరించి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ధ్వజావరోహణం నిర్వహిస్తున్న అర్చకులు
* అమ్మవారి పంచమి తీర్థం ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం పద్మసరోవరం పరిసర ప్రాంతాల్లో పోలీసు భద్రతను ఆయన పర్యవేక్షించారు. తితిదే, పోలీసు సంయుక్తంగా ముందస్తు ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు చేశారన్నారు.
నేడు పుష్పయాగం
శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు వరకు జరిగే కార్యక్రమంలో టన్నుల కొద్దీ పుష్పాలను వినియోగించనున్నారు. ఆర్జిత సేవా టికెట్ కొనుగోలు చేస్తే ఇద్దరిని అనుమతిస్తారు. మంగళవారం ఆలయంలో జరగాల్సిన అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.
శ్రీవారి తరఫున తీసుకొచ్చిన బంగారు పతకాలు చూపుతున్న వైవీ సుబ్బారెడ్డి, ఏవీ ధర్మారెడ్డి
భక్తులకు కష్టాలు
తోపులాట కారణంగా భక్తుల మధ్య ఘర్షణ
పంచమి తీర్థంలో పాల్గొన్న భక్తులు పుణ్యస్నానాల తర్వాత బయటకు వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ఎటు చూసినా బారికేడ్లు కనిపించడం, బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు గేట్లు ఎక్కి బయటకు దూకే క్రమంలో గాయాలపాలయ్యారు. పద్మసరోవరంలోకి ఉదయం 10.30 గంటలకు అనుమతించారు. రాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఉదయానికి ఓపిక నశించి భద్రతా సిబ్బందితో గొడవపడ్డారు. ప్రవేశ మార్గాలపైన దృష్టి పెట్టిన అధికారులు నిష్క్రమణ మార్గాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.
పోలీసులు అడ్డుకోవడంతో భక్తుల అవస్థలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
[ 18-04-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. -
తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు
[ 18-04-2024]
తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు అంటుకున్నాయి. పార్వేట మండపం శ్రీ గంధం పార్కు సమీప అడవిలో మంటలు వ్యాపించాయి. -
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!
[ 18-04-2024]
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు. కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. -
కర్ణాటక మద్యం తరలిస్తూ...
[ 18-04-2024]
కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ విధ్వంస రచన!
[ 18-04-2024]
నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. -
పస్తులతో పనులు చేస్తున్నాం
[ 18-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. -
20న చంద్రబాబు పర్యటన
[ 18-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. -
జడ్పీలో లేకున్నా అతనే కీలకం
[ 18-04-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. -
సమగ్ర శిక్షే
[ 18-04-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. -
ఇంట్లో దూరింది నిజమే..
[ 18-04-2024]
జడ్పీ నోడల్ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్ఛార్జి ఎంపీడీవో రాజేష్, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. -
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!