31,777 మంది రైతులకు రూ.8.47 కోట్ల జమ
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా జిల్లాలోని 31,777 మంది రైతుల ఖాతాల్లోకి రూ.8.47 కోట్ల లబ్ధి జమ అయిందని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు.
మెగా చెక్కును ఆవిష్కరిస్తున్న జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ హరినారాయణన్ తదితరులు
చిత్తూరు కలెక్టరేట్: వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా జిల్లాలోని 31,777 మంది రైతుల ఖాతాల్లోకి రూ.8.47 కోట్ల లబ్ధి జమ అయిందని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. రైతుల ఖాతాల్లోకి నగదు జమ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లె నుంచి వర్చువల్ విధానంలో నిర్వహించారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. వరుసగా మూడో ఏడాదీ సున్నా వడ్డీ పంట రుణాల్ని అందించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ రూ.లక్ష లోపు రుణం తీసుకుని, సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీని ప్రభుత్వం అందిస్తోందన్నారు. దీంతోపాటు పంట నష్ట పరిహారం కింద 1,277 మంది రైతులకు రూ.56.99 లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా