పట్టుబట్టారు.. ప్రోత్సాహకాలు మరిచారు
ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని అధికారులు చెప్పడంతో ఎస్.ఆర్.పురం మండలం పెరుమారెడ్డిగారిఇల్లుకు చెందిన రైతు సోమశేఖర్రెడ్డి ఏడాదిన్నర క్రితం రెండు ఎకరాల్లో పట్టు సాగు చేశారు.
15 నెలలుగా బిల్లులు రాని వైనం
అప్పులపాలవుతున్న రైతులు
ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని అధికారులు చెప్పడంతో ఎస్.ఆర్.పురం మండలం పెరుమారెడ్డిగారిఇల్లుకు చెందిన రైతు సోమశేఖర్రెడ్డి ఏడాదిన్నర క్రితం రెండు ఎకరాల్లో పట్టు సాగు చేశారు. పట్టుగూళ్ల పెంపకానికి షెడ్ కూడా నిర్మించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.5.20 లక్షలు ఇంకా రావాలి. పలమనేరు మార్కెట్లో 400 కిలోల పట్టుగూళ్లు ఇవ్వగా వాటికి రూ.2 లక్షలు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం అందాలి. అప్పులు చేసి పంట సాగు చేశానని.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నానని సోమశేఖర్రెడ్డి వాపోతున్నారు.
ఈనాడు డిజిటల్, చిత్తూరు, న్యూస్టుడే, శ్రీరంగరాజపురం: అన్నదాతలు సంప్రదాయ పంటల నుంచి మార్కెటింగ్ పరంగా అవకాశాలున్న పట్టు సాగు వైపు మళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ప్రోత్సాహకాలు అందుతాయని చెబుతున్నారు.. నష్టాల బాటలో ఉన్న రైతాంగం ఈ మాటలు నమ్మి వ్యయప్రయాసలకు ఓర్చి క్రమంగా పట్టు పంట వైపు అడుగులు వేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్పిన హామీని విస్మరిస్తోంది.. ఫలితంగా అన్నదాతలు రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు.
పట్టు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు రూ.2 చొప్పున ఎకరాకు 3 వేల మొక్కలకు రూ.6 వేలు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కూలీలు, కలుపుతీత తదితర ఖర్చులకు ఏటా ఉపాధి హామీ పథకం నుంచి రూ.40వేలు వస్తాయి. ఇలా మూడేళ్లపాటు చెల్లిస్తారు. పట్టుగూళ్ల పెంపకం షెడ్ నిర్మాణానికి రాయితీలు ఇస్తున్నారు. చివరగా మార్కెట్కు తెచ్చే పట్టుగూళ్లకు ప్రభుత్వం కిలోకు రూ.50 అదనంగా చెల్లిస్తోంది. ఇలా జిల్లావ్యాప్తంగా అధిక శాతం మంది రైతులకు పంట నిర్వహణకు ఇచ్చే డబ్బులు రాలేదు. 15 నెలలుగా పట్టుగూళ్లకూ ప్రోత్సాహకాలు అందించడంలేదు. ప్రభుత్వానికి ఎప్పటిక ప్పుడు బిల్లులు పంపుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో రైతులు ఉసూరుమం టున్నారు. మొత్తంగా అన్నదాతలకు ప్రభుత్వం రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాలి.
నష్టాలతో సాగుకు దూరమవుతూ: ఓవైపు పట్టు సాగుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు రాకపోవడం, కొవిడ్ తర్వాత వరుసగా పట్టుగూళ్ల ధరలు గణనీయంగా తగ్గడంతో కొందరు రైతులు ఆ పంటను తీసేశారు. ఇప్పుడు కిలో రూ.600- రూ.700 పలుకుతున్నా తిరిగి ఎప్పుడు గడ్డు పరిస్థితులు తలెత్తుతాయోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. ఈక్రమంలోనే కర్షకులు ప్రత్యామ్నాయ పంటలు వైపు మళ్లుతున్నారు.
రాష్ట్రంలోనే రెండో స్థానం: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా పట్టుకు డిమాండ్ పెరిగింది. దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోయే పరిస్థితి సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో పట్టు సాగుకు అనుకూలమైన వాతావరణం మన రాష్ట్రంలోనూ ఉన్నందున ఇక్కడ పంట విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్రం నిర్దేశించింది. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ఏజెన్సీ ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. మొక్కల కొనుగోలు నుంచి పట్టుగూళ్ల విక్రయం వరకూ ప్రతి దశలోనూ అన్నదాతలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుత చిత్తూరు జిల్లాలో 38 వేల ఎకరాల్లో మల్బరీ పట్టు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉంది. అందులోనూ కుప్పం, పలమనేరు, పుంగనూరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనే అత్యధికంగా పండిస్తున్నారు.
జిల్లాలో పట్టు సాగు విస్తీర్ణం: 38 వేల ఎకరాలు
బకాయిలు రావాల్సిన రైతులు: 5,800 మంది
ఎన్ని నెలలుగా: 15 నెలలు
మొత్తం బకాయిలు: రూ.9 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!
[ 18-04-2024]
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు. కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. -
కర్ణాటక మద్యం తరలిస్తూ...
[ 18-04-2024]
కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ విధ్వంస రచన!
[ 18-04-2024]
నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. -
పస్తులతో పనులు చేస్తున్నాం
[ 18-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. -
20న చంద్రబాబు పర్యటన
[ 18-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. -
జడ్పీలో లేకున్నా అతనే కీలకం
[ 18-04-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. -
సమగ్ర శిక్షే
[ 18-04-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. -
ఇంట్లో దూరింది నిజమే..
[ 18-04-2024]
జడ్పీ నోడల్ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్ఛార్జి ఎంపీడీవో రాజేష్, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. -
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..