logo

జిల్లాకు చేరిన బైజూస్‌ ట్యాబ్‌లు

జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న దాదాపు 18 వేల మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో 6,120 ట్యాబ్‌లు సోమవారం తిరుపతి చేరుకున్నాయి.

Published : 29 Nov 2022 02:16 IST

మండలానికి 180 కేటాయింపు

బైజూస్‌ ట్యాబ్‌లను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న దాదాపు 18 వేల మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో 6,120 ట్యాబ్‌లు సోమవారం తిరుపతి చేరుకున్నాయి. వీటిని జిల్లాలోని ఒక్కో మండలానికి 180 కేటాయిస్తూ విద్యాశాఖాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ట్యాబ్‌ల విలువ రూ.9.18 కోట్లని అధికారులు తెలిపారు. పది రోజుల్లో రెండు, మూడో విడతలో అన్ని ట్యాబ్‌లు జిల్లాకు చేరుతాయని డీఈవో వి.శేఖర్‌ తెలిపారు. కార్యక్రమంలో బైజూస్‌ జిల్లా నోడల్‌ అధికారి జి.సురేష్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని