బిల్లు రాక.. పూర్తి చేయక..
ఇది గుడుపల్లెలోని రైతు భరోసా కేంద్రం. రెండేళ్ల కిందట రూ.21 లక్షలు మంజూరు కాగా ఇప్పటివరకు రూ.16 లక్షలు విడుదలయ్యాయి.
సచివాలయ, ఆర్బీకేల పరిస్థితి ఇదీ
కొన్నిచోట్ల నిర్మించినా అప్పగించని వైనం
* ఇది గుడుపల్లెలోని రైతు భరోసా కేంద్రం. రెండేళ్ల కిందట రూ.21 లక్షలు మంజూరు కాగా ఇప్పటివరకు రూ.16 లక్షలు విడుదలయ్యాయి. గుత్తేదారుకు రూ.2 లక్షల వరకు బిల్లులు రావాలి. అవి వస్తే పెండింగ్ పనులు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆరు నెలలుగా పనులు ఆగాయి. భవనం అందుబాటులోకి రాకపోవడంతో పాత పశువైద్యశాలలోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి.
* ఇది పెద్దపంజాణి మండలం చలమంగళంలోని వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం. రూ.17 లక్షలు మంజూరు కాగా.. రూ.7 లక్షలు వచ్చాయి. తలుపులు, కిటికీలు, ర్యాంపు నిర్మాణానికి మరికొంత ఖర్చు చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈ భవనాన్ని ప్రారంభించగా.. కొన్నిరోజులకే తాళాలు వేశారు. మిగిలిన నిధులూ విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని గుత్తేదారు కోరుతున్నారు.
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, సూళ్లూరుపేట
‘సచివాలయ వ్యవస్థ నా మానసపుత్రిక’ అని సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా సొంత భవనాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీటి నిర్మాణ పురోగతి భిన్నంగా ఉంది. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో నెమ్మదిగా పనులు చేస్తున్నారు. కొన్నిచోట్ల భవన నిర్మాణాలు తుది దశలో నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తయినా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. సకాలంలో బిల్లులు మంజూరు చేసి వీటిని అందుబాటులోకి తెస్తే ప్రజలకు అవస్థలు తప్పడంతోపాటు పంచాయతీలపై అద్దెల భారమూ తగ్గుతుంది.
ప్రభుత్వం 2019 అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయ సేవలు ప్రారంభించింది. సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు 2019-20లో ఉపాధి హామీ పథకం నిధులు మంజూరయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి అదే ఆర్థిక సంవత్సరంలో పచ్చజెండా ఊపారు.
అధికార పార్టీకి చెందినా..
అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే గుత్తేదారుల అవతారం ఎత్తి భవన నిర్మాణ పనులు దక్కించుకున్నారు. బిల్లుల మంజూరులో తీవ్రజాప్యం జరగడంతో ఉమ్మడి జిల్లాలో ఆరు నెలలు- ఏడాదిపాటు నిర్మాణాలు నత్తనడకన సాగాయి. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనైతే పూర్తిగా నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చినా గుత్తేదారులు ససేమిరా అన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. అనంతరం కొంత బిల్లులు జమ కావడంతో పనులు పునః ప్రారంభించారు.
భవనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ..
సూళ్లూరుపేట, నగరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలు పంచాయతీల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో గుత్తేదారుకు రూ.2 లక్షలు- రూ.10 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో భవనాలు అప్పగిస్తే బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే అన్ని పనులు పూర్తయినా ప్రారంభోత్సవానికి మాత్రం అంగీకరించడంలేదు. పలు ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే తుది మెరుగులు దిద్దలేదు. యంత్రాంగం స్పందించి బిల్లులు మంజూరు చేయిస్తే భవనాలు అప్పగిస్తామని వారు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు
[ 18-04-2024]
తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు అంటుకున్నాయి. పార్వేట మండపం శ్రీ గంధం పార్కు సమీప అడవిలో మంటలు వ్యాపించాయి. -
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!
[ 18-04-2024]
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు. కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. -
కర్ణాటక మద్యం తరలిస్తూ...
[ 18-04-2024]
కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ విధ్వంస రచన!
[ 18-04-2024]
నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. -
పస్తులతో పనులు చేస్తున్నాం
[ 18-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. -
20న చంద్రబాబు పర్యటన
[ 18-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. -
జడ్పీలో లేకున్నా అతనే కీలకం
[ 18-04-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. -
సమగ్ర శిక్షే
[ 18-04-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. -
ఇంట్లో దూరింది నిజమే..
[ 18-04-2024]
జడ్పీ నోడల్ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్ఛార్జి ఎంపీడీవో రాజేష్, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. -
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్