ఉపాధ్యాయులకే పరీక్ష
చిత్తూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 55మంది విద్యార్థులకు తరగతుల వారీగా బ్లాక్ బోర్డుపై ఉపాధ్యాయుడు ప్రశ్నలు రాశారు. వాటిని రాసుకుని ఆపై సమాధానాలు రాశారు.
బొమ్మలు గీసేందుకే అధిక సమయం
ప్రశ్నపత్రాల జిరాక్స్కు పరుగులు
చిత్తూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బ్లాక్బోర్డుపై ఉన్న పరీక్ష ప్రశ్నలు రాసుకుంటున్న విద్యార్థులు
చిత్తూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 55మంది విద్యార్థులకు తరగతుల వారీగా బ్లాక్ బోర్డుపై ఉపాధ్యాయుడు ప్రశ్నలు రాశారు. వాటిని రాసుకుని ఆపై సమాధానాలు రాశారు. ఒకటో తరగతి విద్యార్థులకు శనివారం నిర్వహించిన ఇంగ్లిషు పరీక్షలో బొమ్మల పక్కనఉన్న సరైన పదాన్ని జత పరచాలి. రెండో పేజీలో ఇచ్చిన బొమ్మలకు రంగులు దిద్దాల్సి ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
చిత్తూరు విద్య, న్యూస్టుడే: ఇప్పటివరకు ప్రశ్నపత్రం చేతికిస్తే వాటిని చూసి విద్యార్థులు సమాధానాలు రాసేవారు. ఇప్పుడు ప్రశ్నలు బోర్డుపై రాస్తే పిల్లలు చూసి రాసుకుని పరీక్ష రాయాలి. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఏఫ్ఏ-2 పరీక్షల విధానం ఉపాధ్యాయులకే పరీక్ష పెడుతోంది. కొన్ని సబ్జెక్టుల్లో బొమ్మలు బోర్డుపై గీయడం టీచర్లకు తలనొప్పిగా మారింది. రెండో తరగతి ప్రశ్నపత్రంలో టెన్నిస్, క్రికెట్, గేమ్స్, స్పోర్ట్స్ పదాలు పైన ఇచ్చి కింద గజిబిజిగా.. ఏబీసీడీలు గడులుగా రాసి అందులో పైపదాలు కలపాలి. ఇలా ప్రశ్నపత్రాలు రూపొందించగా వాటిని బోర్డుపై ఉపాధ్యాయుడు రాసిన తర్వాత విద్యార్థులు రాసుకుని సమాధానాలు రాయాలి.
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా..?
ఈ పరీక్షలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా నిర్వహించాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలోని 1,904 ప్రాథమిక పాఠశాలల్లో.. 953 చోట్ల ఏకోపాధ్యాయులే. ఈ సారి ప్రశ్నపత్రం గంట ముందు ప్రధానోపాధ్యాయులకు వాట్సప్నకు రాగానే డౌన్లోడ్ చేసుకుని.. ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తే విద్యార్థులు వాటిని రాసుకుని ఆపై సమాధానాలు రాస్తున్నారు. విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు సొంత నగదుతో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ చేసుకుని పిల్లలకు ఇస్తున్నారు. 20 మంది కన్నా తక్కువగా ఉన్న పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇద్దరు ఉండాలి. ఆయా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఏకోపాధ్యాయుడే ఉన్నారు. ఇప్పుడు సర్దుబాటు పేరుతో అవసరమైన పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయిస్తారో లేదో వేచిచూడాలి.
పూతలపట్టు మండలం దొమ్మాండపల్లె ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులకు ఉన్న ఏకోపాధ్యాయుడు శనివారం సెలవు పెట్టడంతో మరొకరు వచ్చారు. ఆయన రెండు కిమీ దూరంలో ఉన్న పి.కొత్తకోటకు వెళ్లి ప్రశ్నపత్రాలు సొంత నగదుతో జిరాక్స్ తీసుకుని వచ్చి పరీక్ష నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు