logo

పెళ్లికి వెళ్తుండగా కాటేసిన మృత్యువు

బావమరిది పెళ్లికి వెళ్తుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలైన ఘటన పూతలపట్టు-నాయుడుపేట హైవేపై చోటుచేసుకుంది.

Published : 04 Dec 2022 03:48 IST

పూతలపట్టు: బావమరిది పెళ్లికి వెళ్తుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలైన ఘటన పూతలపట్టు-నాయుడుపేట హైవేపై చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. బంగారుపాళ్యం మండంలోని ఈచినేరుపల్లెకు చెందిన మొగిలప్ప(64) తన కుటుంబం, గ్రామస్థులతో కలిసి శుక్రవారం రాత్రి విజయవాడలోని బావమరిది వివాహానికి బస్సులో బయల్దేరాడు. మధ్యలో హైవేలో పేట అగ్రహారం వద్ద మూత్ర విసర్జనకు ఆయన కిందకు దిగాడు. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. పెళ్లికి బయల్దేరితే మృత్యువు కాటేసి తమ కుటుంబాల్లో విషాదం నింపిందంటూ కుటుంబీకులు విలపించారు. ఎస్సై హరిప్రసాద్‌ కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని