ట్రాక్టర్‌ బోల్తాపడి రైతు మృతి

బెంగళూరులో కార్మికుడిగా పనిచేస్తున్న మండలంలోని కాళేపల్లెకు చెందిన రైతు మోహన్‌రెడ్డి(49) పది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు.

Updated : 04 Dec 2022 04:50 IST

మోహన్‌రెడ్డి (పాతచిత్రం)

జీడీనెల్లూరు: బెంగళూరులో కార్మికుడిగా పనిచేస్తున్న మండలంలోని కాళేపల్లెకు చెందిన రైతు మోహన్‌రెడ్డి(49) పది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. పొలంలో దుక్కి దున్నేందుకు ఆయన శనివారం వెళ్లాడు. దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ బోల్తాపడి దాని కింద ఇరుక్కు పోయాడు. గమనించిన గ్రామస్థులు వచ్చి ట్రాక్టర్‌ను తిప్పేసరికే అతడు మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని