పక్క సర్వే సంఖ్యతో కాల్వనే రాసిచ్చాడు..?
కబ్జాలతో హద్దులను మార్చేశాడు ఆ భూబకాసురుడు... రెవెన్యూ అధికారుల సాయంతో ఏకంగా కాల్వనే ఆక్రమించేశాడు.
రెవెన్యూ అధికారి బంధుప్రీతి
కాల్వకు అడ్డుగా నిర్మించిన గోడ
రేణిగుంట, న్యూస్టుడే: కబ్జాలతో హద్దులను మార్చేశాడు ఆ భూబకాసురుడు... రెవెన్యూ అధికారుల సాయంతో ఏకంగా కాల్వనే ఆక్రమించేశాడు. ఒక రెవెన్యూ అధికారి బంధుప్రీతి చూపించి పక్క సఖ్య వేసి కాల్వకే పట్టా చేసేర్వే సంశారు. ఈ అక్రమంపై అధికార పార్టీలోని నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రేణిగుంట మండలంలో ఒకప్పుడు రూ.లక్షల్లో పలుకుతున్న భూమి ధర ప్రస్తుతం రూ.కోట్లకు చేరింది. అత్యంత విలువైన రేణిగుంట పంచాయతీలోని వివేకానందకాలనీ సమీపంలోని భూములపై కొందరి కళ్లుపడ్డాయి. తూకివాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 831లో 14.28 ఎకరాలు వాగు పోరంబోకు, సర్వే నంబర్ 832లో 4.46 ఎకరాల వాగు ఉంది. గతంలో నీరు పారుతున్న ఈ వాగును జేసీబీతో రేణిగుంట పంచాయతీకి చెందిన ఒక వార్డు సభ్యురాలి బంధువు, అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు పూడ్చారు. అక్కడికి నీరు రాకుండా ఏకంగా మధ్యలో ఓ గోడ నిర్మించారు. ఇదే క్రమంలో వీటి పక్కనే ఉన్న సర్వే నంబర్ 830లో 38 సెంట్లు వాగు పోరంబోకు ఉండేది. ఇదంతా కొన్నాళ్ల కిందట రికార్డుల పరంగా ఇలానే ఉన్నప్పటికి ఇప్పుడు మారిపోయాయి. ఓ రెవెన్యూ అధికారి భార్యకు రేణిగుంటలో బంధువులు ఉండటం, ఆ బంధుప్రీతితో ఇక్కడ ప్రభుత్వ స్థలాలను అతనికి ఇచ్చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలాన్ని పూర్తిగా చదును చేసేశాడు. మరో సర్వే నంబర్తో ఉన్న పత్రాలను చూపుతూ ఇక్కడ కబ్జా చేస్తున్నాడు. ఇదంతా రెవెన్యూ అధికారులు కనుసన్నుల్లో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది
ఇలా చేసేశారు..
వాగు పక్కనే ఉన్న సర్వే నంబర్తో ఇదే ఆ భూమి అన్నట్లు బై నెంబర్లు వేసి రికార్డులు సృష్టించారు. అందుకు అనూకులంగా పక్కనే ఉన్న నెంబర్తో కొంత భూమి కొన్నట్లు పత్రాలు సృష్టించారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత ముందుగా ఇక్కడ ఉన్న వాగు పక్కనే ఉన్న ముళ్లపొదలను, పిచ్చిమొక్కలను తొలగించే పని చేపట్టాడు. అప్పటికి ఎవరు రాకపోవడంతో జేసీబీ సాయంతో వాగు మొత్తం చాలా వరకు చదును చేసేశాడు. అనంతరం ప్రహరీ నిర్మించారు. దానిపై ఫోన్ నెంబర్లు కూడా రాయించాడు. సర్వే నెంబర్ 830లో కేవలం 38 సెంట్లు ఉండగా దీనిని విభజించారు. 830/1ఏ, 830/1బీ, 830/1సీ, 830/2 అనే సృష్టించారని, ఇందులో మొత్తం సుమారు 2.09 ఎకరాలు భూమి ఉందని సృష్టించి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించేశారని స్థానికులు వాపోయారు. ఎవరైనా తనను ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతానని హెచ్చరించారని స్థానికులు వాపోయారు. జ్ఞదీనిపై తహసీల్దార్ శివప్రసాద్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, విచారించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.